iDreamPost

IND vs ENG: టీమిండియాకు తప్పిన గండం! తొలి టెస్ట్‌ హీరోను జీరో చేసిన బుమ్రా!

  • Published Feb 03, 2024 | 2:19 PMUpdated Feb 03, 2024 | 5:08 PM

వైజాగ్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్​కు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది.

వైజాగ్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్​కు ఓ రేంజ్​లో పోయిస్తున్నారు. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాటర్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది.

  • Published Feb 03, 2024 | 2:19 PMUpdated Feb 03, 2024 | 5:08 PM
IND vs ENG: టీమిండియాకు తప్పిన గండం! తొలి టెస్ట్‌ హీరోను జీరో చేసిన బుమ్రా!

వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్​కు భారత బౌలర్లు ఒక రేంజ్​లో పోయిస్తున్నారు. అటాకింగ్ బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాటర్లకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు. రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అతడి కెరీర్​లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. టెయిలెండర్లలో రవిచంద్రన్ అశ్విన్ (20) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా బ్యాట్లెత్తేయడంతో 400 పరుగులకు నాలుగు పరుగుల దూరంలో భారత ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్​కు మంచి స్టార్ట్ దొరికింది. కానీ ఆ తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. తొలి టెస్టులో భారీ సెంచరీతో మ్యాచ్​ను తారుమారు చేసిన ఓలీ పాప్ (23) కూడా ఔటవ్వడంతో రోహిత్ సేనకు పెద్ద గండం తప్పింది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసిన జాక్ క్రాలే (76), బెన్ డకెట్ (21) ఫస్ట్ వికెట్​కు 59 పరుగులు జోడించారు. అయితే కుల్దీప్ బౌలింగ్​లో రజత్ పాటిదార్​కు క్యాచ్ ఇచ్చి డకెట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పోప్, క్రాలే కలసి స్కోరు బోర్డును 100 పరుగులు దాటించారు. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న క్రాలేను అక్షర్ పెవిలియన్​కు చేర్చాడు. అతడు వేసిన బాల్​ను భారీ షాట్​ కొడదామనుకున్నాడు క్రాలే. కానీ బాల్ గాల్లోకి లేవడంతో అయ్యర్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత జో రూట్​ (5)ను ఔట్ చేసిన బుమ్రా.. కొద్ది గ్యాప్​లోనే పాప్​ను కూడా ఔట్ చేశాడు. ఓ అద్భుతమైన బంతితో తొలి టెస్టు హీరో పాప్​ను జీరోను చేశాడు జస్​ప్రీత్.

బుమ్రా వేసిన డెడ్లీ యార్కర్​కు పాప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్​లో తొలి 4 బంతుల్ని నార్మల్​గా వేసి మంచి సెటప్ చేసిన బుమ్రా.. ఐదో బాల్​గా యార్కర్​ వేశాడు. బుల్లెట్​ స్పీడ్​తో దూసుకొచ్చిన ఆ బాల్​కు పాప్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఓపెనర్లతో పాటు కీలకమైన రూట్, ప్రమాదకర పాప్ కూడా క్రీజును వీడటంతో భారత్​కు పెద్ద గండం తప్పింది. ఇలాగే దూకుడుగా బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్​ను 250 పరుగుల్లోపే ఆలౌట్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్ టీమ్ 32.3 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులతో ఉంది. జానీ బెయిర్​స్టో (23 నాటౌట్​)తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. రెండో టెస్టులో భారత బౌలర్ల ప్రదర్శనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Yashasvi Jaiswal: పిట్ట కొంచెం కూత ఘనం! 22 ఏళ్లకే రికార్డుల రారాజుగా జైస్వాల్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి