Nidhan
ఆఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు భారత టీమ్ను ప్రకటించారు. అయితే కేఎల్ రాహుల్తో పాటు మరో ఐదుగురు స్టార్లకు సెలక్టర్లు షాకిచ్చారు.
ఆఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు భారత టీమ్ను ప్రకటించారు. అయితే కేఎల్ రాహుల్తో పాటు మరో ఐదుగురు స్టార్లకు సెలక్టర్లు షాకిచ్చారు.
Nidhan
ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ మ్యాచులపై అన్ని జట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. భారత జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ మీద దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను ప్లాన్ చేసింది. వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే కానుంది. ఆఫ్ఘాన్ సిరీస్ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అనంతరం డైరెక్ట్గా మెగాటోర్నీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అందుకే ఆఫ్ఘాన్తో సిరీస్ను కీలకంగా భావిస్తోంది. ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ ఆదివారం 16 మంది సభ్యులతో కూడిన టీమ్ను ప్రకటించింది. ఏడాది గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చారు. హిట్మ్యానే కెప్టెన్గా ఉండనున్నాడు. అయితే అనూహ్యంగా కేఎల్ రాహుల్తో పాటు మరో ఐదుగురు స్టార్లకు స్క్వాడ్లో చోటు దక్కలేదు.
ఆఫ్గాన్తో టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీ మొదలు కానుంది. 11న తొలి టీ20, 14న రెండో టీ20, 17న ఆఖరి టీ20 జరగనున్నాయి. అయితే గాయాల కారణంగా హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్కు దూరమయ్యారు. టీమ్లో కీలకంగా వ్యవహరిస్తాడని, చోటు పక్కా అని అనుకున్న కేఎల్ రాహుల్కు సెలక్టర్లు షాకిచ్చారు. అతడితో పాటు వన్డేల్లో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్కూ మొండిచెయ్యి చూపారు. అలాగే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, స్పీడ్స్టర్ దీపక్ చాహర్కూ టీమ్లో చోటు దక్కలేదు. వీళ్లలో జడేజా రీసెంట్గా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు. వెన్ను నొప్పి కారణంగా సఫారీలతో తొలి టెస్టుకు దూరమైన ఆల్రౌండర్.. రెండో మ్యాచ్లో బరిలోకి దిగినా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. గాయం పూర్తిగా మానాలని జడ్డూను పక్కనపెట్టారా? లేదా టీ20ల్లో అతడి కంటే అక్షర్ పటేల్ బెటర్ అనే ఉద్దేశంతో ఇలా చేశారా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇంజ్యురీ గురించి ఆలోచిస్తే సౌతాఫ్రికాతో రెండో టెస్ట్లో ఎందుకు ఆడించారో అర్థం కావడం లేదు.
పర్సనల్ రీజన్స్ వల్ల సౌతాఫ్రికా టూర్ మధ్యలో నుంచే వచ్చేశాడు ఇషాన్ కిషన్. అయితే ఆఫ్ఘాన్తో సిరీస్కైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటే అదీ సాధ్యపడలేదు. ఆరోగ్య కారణాల వల్లే ఈ సిరీస్కు అతడు దూరమయ్యాడట. మెంటల్ ఫెటీగ్ (మానసికంగా అలసిపోవడం) వల్లే ఈ సిరీస్లో ఇషాన్ ఆడట్లేదని సమాచారం. అతడి ప్లేస్లో సంజూ శాంసన్ను ఎంపిక చేశారు. వన్డే వరల్డ్ కప్తో పాటు సౌతాఫ్రికా టూర్లోనూ దుమ్మురేపిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను సెలక్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిట్గానే ఉన్నా, ఏ ప్లేస్లో ఆడేందుకైనా రెడీగా ఉన్నానని ప్రకటించినా రాహుల్ను దూరం పెట్టడం కొత్త డిస్కషన్స్కు తెరలేపింది. పేసర్ దీపక్ చాహర్ కూడా ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో లేడు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్కు చాహర్ దూరంగా ఉన్నాడు. ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్లోనూ ఆడొద్దని అతడు డిసైడ్ అయ్యాడట. మరి.. కేఎల్ రాహుల్ సహా పలువురు స్టార్లకు సెలక్టర్లు షాకివ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.
ఇదీ చదవండి: David Warner: వార్నర్ షాకింగ్ కామెంట్స్.. T20లకు కూడా వీడ్కోలు చెబుతాడా?
India’s T20i squad against Afghanistan:
Rohit (C), Kohli, Gill, Jaiswal, Tilak, Rinku, Jitesh (WK), Sanju (WM), Shivam Dube, Sundar, Axar, Bishnoi, Kuldeep, Arshdeep, Avesh and Mukesh Kumar. pic.twitter.com/w7EZUt5Wry
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024