iDreamPost

Shivam Dube: రోహిత్​కు బదులు దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. శివమ్ రియాక్షన్ వైరల్!

  • Published Jan 18, 2024 | 8:43 PMUpdated Jan 18, 2024 | 8:43 PM

ఆఫ్ఘానిస్థాన్​తో బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీ టైమ్​లో ఆల్​రౌండర్ శివమ్ దూబె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.

ఆఫ్ఘానిస్థాన్​తో బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీ టైమ్​లో ఆల్​రౌండర్ శివమ్ దూబె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.

  • Published Jan 18, 2024 | 8:43 PMUpdated Jan 18, 2024 | 8:43 PM
Shivam Dube: రోహిత్​కు బదులు దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. శివమ్ రియాక్షన్ వైరల్!

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​లో ఉన్న టీమిండియాకు ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్ బాగా పనికొచ్చింది. మెగా టోర్నీకి ముందు పొట్టి ఫార్మాట్​లో జరగనున్న ఆఖరి సిరీస్ కావడంతో భారత్ భయపడకుండా ప్రయోగాలు చేసింది. ఈ సిరీస్​లో చాలా మంది యంగ్​స్టర్స్​కు అవకాశాలు ఇచ్చింది. అయితే అందులో యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, రింకూ సింగ్ వంటి కొందరు మాత్రమే రాణించారు. ముఖ్యంగా దూబె ఆటతీరు గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తొలి రెండు టీ20ల్లో అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడీ లెఫ్టాండర్. బౌలింగ్​లోనూ రాణించి కీలక సమయాల్లో టీమ్​కు కావాల్సిన బ్రేక్ త్రూలు అందించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే ఈ పురస్కారాన్ని అందుకోవడానికి దూబె వెళ్లిన టైమ్​లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దూబేకు అవార్డు ఇవ్వగా ఇది తనకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాడతను.

ఈ సిరీస్​లో ఫెంటాస్టిక్ బ్యాటింగ్​తో పాటు బాల్​తోనూ ఆకట్టుకోవడంతో శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (పీవోటీఎస్) అవార్డును దక్కించుకున్నాడు. చివరి టీ20లో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ (పీవోటీఎం)గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పురస్కారాల ప్రదానోత్సవం సమయంలో దూబేను వేదిక దగ్గరకు పిలవడంతో అతడు వెళ్లాడు. అయితే కామెంటేటర్ మురళీ కార్తీక్ రోహిత్​కు బదులు దూబేను పీవోటీఎం అవార్డు తీసుకోవాలని కోరాడు. దీంతో అక్కడికి వచ్చిన దూబె తనకు పీవోటీఎం అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీంతో తప్పు తెలుసుకున్న కార్తీక్ సారీ చెప్పాడు. పీవోటీఎస్ అవార్డును స్వీకరించాలన్నాడు. దీంతో నవ్విన దూబె ఆ పురస్కారాన్ని తీసుకొని అక్కడి నుంచి టీమ్ దగ్గరకు వెళ్లిపోయాడు.

శివమ్ దూబె-మురళీ కార్తీక్ మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు దూబె ప్రెజెన్స్ ఆఫ్​ మైండ్ సూపర్బ్ అని అంటున్నారు. అతడు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడని చెబుతున్నారు. ఇక, దూబె రాణించడంతో ఓ టీమిండియా స్టార్​కు ఇక కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దూబె వల్ల స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేస్​కు ముప్పు పొంచి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో కూడా దూబె ఇదే రీతిలో అదరగొడితే టీ20 వరల్డ్ కప్-2024 తుది జట్టులో అతడ్నే రోహిత్ తీసుకోవడం ఖాయమని అంటున్నారు. బిగ్ సిక్సెస్ ఈజీగా కొట్టగలగడం, మ్యాచులు ఫినిష్ చేయడం, ఎఫెక్టివ్​గా రెండు ఓవర్లు వేసే సత్తా ఉన్న దూబేను తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి.. రోహిత్​కు బదులు దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Rohit-Virat: రోహిత్‌, కోహ్లీలనే డకౌట్‌ చేశారు! ఇతన్ని ఒక్కసారి కూడా ఔట్‌ చేయలేకపోయారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి