iDreamPost

Crime News ప్రియుడితో రాస‌లీలలు.. భార్య‌ను ప‌ట్టించ‌డానికి గదికి బయట నుంచి తాళం వేసి

Crime News ప్రియుడితో రాస‌లీలలు..  భార్య‌ను ప‌ట్టించ‌డానికి  గదికి బయట నుంచి తాళం వేసి

ప‌రాయి వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న భార్య‌ను ప‌ట్టుకోవ‌డానికి, ఓ భ‌ర్త గదికి తాళాలేశాడు. ఇద్ద‌రూ లోప‌ల ఉండ‌గా, బయటి నుంచి తాళం వేసి, పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అప్పగించాడు. ఆ త‌ర్వాత‌ తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు.

జూబ్లీహిల్స్‌ రహ్మత్‌నగర్‌లోని యాదగిరినగర్‌లో నివసిస్తున్న మహిళ(35)కు ఇద్దరు పిల్లలు. భర్త జవాన్. సరిహద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.

యాదగిరినగర్‌లో త‌న భార్య‌, జ్ఞానేశ్వర్‌ తో సహజీవనం చేస్తున్నట్లుగా తెలుసుకొని, అక్కడికి వెళ్లాడు. గ‌దికి తాళం వేసి పోలీసులను ప‌లిచాడు. తాళం తీసిన పోలీసులు విచారణ చేపట్టారు. త‌న‌కు భ‌ర్త ఉన్నా, ఈ ఇంటిని అద్దెకు తీసుకునే ముందు, జ్ఞానేశ్వర్‌ తన భర్త అంటూ ఓనర్ కు చెప్పింది. కొంత కాలంగా అత‌నితోనే ఉంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి