iDreamPost

అరుదైన ఘనత సాధించిన ఇంగ్లండ్.. క్రికెట్ చరిత్రలో కేవలం రెండో జట్టుగా..!

  • Author singhj Published - 09:56 AM, Fri - 21 July 23
  • Author singhj Published - 09:56 AM, Fri - 21 July 23
అరుదైన ఘనత సాధించిన ఇంగ్లండ్.. క్రికెట్ చరిత్రలో కేవలం రెండో జట్టుగా..!

యాషెస్ సిరీస్ అందరూ ఊహించినట్లే చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య మ్యాచ్​లు చాలా ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మునివేళ్లపై నిల్చోబెడుతున్నాయి. వరల్డ్ టెస్ట్ సిరీస్​ ఫైనల్లో టీమిండియాను ఓడించి మాంచి ఊపు మీదున్న కంగారూ టీమ్.. యాషెస్​ సిరీస్​లో అదే జోరును కొనసాగించింది. బూడిద కప్ కోసం జరుగుతున్న ఈ సిరీస్​ తొలి టెస్టులో ఆసీస్ అదరగొట్టింది. ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. బజ్​బాల్ స్టైల్ ఆటతీరుతో ఆసీస్​కు చెక్ పెట్టాలనుకున్న ఇంగ్లండ్ తాను తీసుకున్న గోతిలో తానే పడింది.

యాషెస్ సిరీస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్​కు పరాభవమే ఎదురైంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా, స్వదేశంలో టోర్నీ జరుగుతున్నా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆతిథ్య జట్టు పూర్తిగా విఫలమైంది. అయితే మూడో టెస్టులో మాత్రం స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చింది టీమ్ ఇంగ్లండ్. కెప్టెన్ బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ అద్భుతంగా ఆడటంతో కంగారూ టీమ్ పనిపట్టింది. ఆ మ్యాచ్​లో మూడు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లీష్ జట్టు.. సిరీస్​లో గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది. కీలకంగా మారిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.

మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఆసీస్​ను 317 రన్స్​కే ఆలౌట్ చేసింది ఇంగ్లండ్ టీమ్. స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ 5 వికెట్లతో చెలరేగి.. ప్రత్యర్థి బ్యాటింగ్​ను కకావికలం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లండ్.. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 306 రన్స్​తో ఉంది. ఆ టీమ్ ఓపెనర్ జాక్ క్రాలే (174 నాటౌట్), జో రూట్ (65 నాటౌట్) క్రీజులో ఉన్నారు. క్రాలే టీ20 స్టైల్ బ్యాటింగ్​తో కంగారూ బౌలర్లను ఓ రేంజ్​లో ఆటాడుకున్నాడు. ఇక, ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ జట్టు ఒక అరుదైన ఘతనను సాధించింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఒక రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది.

ఓవరాల్​గా టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ రికార్డుల్లోకి ఎక్కింది. అసలు ఆ రికార్డు ఏంటంటే.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే జట్టులో కనీసం 10 మంది ప్లేయర్లు 1,000 రన్స్ చేశారు. గతంలో 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్​లో ఐసీసీ వరల్డ్ ఎలెవన్​ టీమ్ ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్​లో వరల్డ్ ఎలెవన్ టీమ్​లోని 10 మంది ఆటగాళ్లు వెయ్యి పరుగుల మార్కును దాటారు. అప్పటి టీమ్​లో ఒక్క స్టీవ్ హార్మిసన్ (743 రన్స్) తప్ప అందరూ 1,000 పరుగుల మార్క్​ను దాటిన వారే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో జట్టులో కనీసం వెయ్యి రన్స్ చేసిన 10 మంది ప్లేయర్లు ఉన్నారు. కంగారూ టీమ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తుది జట్టులో మార్క్ వుడ్ (681) మినహా మిగిలిన పది మంది ఆటగాళ్లు 1,000 రన్స్ మార్కును దాటడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి