iDreamPost

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రామ్-పూరి సాహసం.. వాళ్ల కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jan 24, 2024 | 9:58 PMUpdated Jan 24, 2024 | 9:58 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ సాహసం చేశారు. వాళ్లిద్దరి కెరీర్​లో ఇంత పెద్ద రిస్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ సాహసం చేశారు. వాళ్లిద్దరి కెరీర్​లో ఇంత పెద్ద రిస్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

  • Published Jan 24, 2024 | 9:58 PMUpdated Jan 24, 2024 | 9:58 PM
Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రామ్-పూరి సాహసం.. వాళ్ల కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్​కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కాంబినేషన్ల మీద ఆడియెన్స్​లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలసి తీసే సినిమాలకు బిజినెస్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. టాలీవుడ్​లో అలాంటి హిట్ కాంబోనే రామ్ పోతినేని-పూరి జగన్నాథ్. వీళ్ల కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఏ రేంజ్​లో బాక్సాఫీస్​ను షేక్ చేసిందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్, రామ్ నటన, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు, పూరి రాసిన డైలాగులు థియేటర్​లో ప్రేక్షకులకు గూస్​బంప్స్ తెప్పించాయి. అందుకే వీళ్ల కాంబోలో నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ కాంబో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్​తో మరోమారు బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్-పూరి భారీ సాహసమే చేశారని తెలుస్తోంది.

ఈ ఏడాది వేసవిలో రిలీజ్​కు రెడీ అవుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ క్లైమాక్స్ ఫైట్​ను రీసెంట్​గా ముంబైలో షూట్ చేశారు. దీని కోసం భారీ సెట్​ను రూపొందించారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.7.5 కోట్లు ఖర్చు చేశారని టాలీవుడ్ టాక్. ప్రముఖ ఫైట్ మాస్టర్ రియల్ సతీష్​ నేతృత్వంలో 12 రోజుల పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్ల మధ్య ఈ ఫైట్​ను రూపొందించారు. సినిమా క్లైమాక్స్ సీన్ కోసం ఇంత భారీగా ఖర్చు చేయడం ఇటు హీరో రామ్​తో పాటు అటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిసింది. సాధారణంగా పూరి తన సినిమాలను తక్కువ బడ్జెట్​లో, తక్కువ టైమ్​లో, క్వాలిటీ ఔట్​పుట్​తో తీస్తుంటారు. పక్కా ప్లానింగ్​తో సమయాన్ని వృథా చేయకుండా అనుకున్న బడ్జెట్​లోనే మంచి ఔట్​పుట్ ఇస్తుంటారాయన. కానీ విలన్​గా బాలీవుడ్ స్టార్ సంజయ్​దత్ ఉండటంతో క్రేజ్​కు తగ్గట్లుగానే ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చు పెట్టారని వినికిడి. అయితే క్లైమాక్స్ కోసం ఇంత భారీగా ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. పూరి ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే ఔట్​పుట్ కూడా నెక్స్ట్ లెవల్లోనే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ‘డబుల్ ఇస్మార్ట్​’కు కూడా ఫస్ట్ పార్ట్​కు మ్యూజిక్ అందించిన మణిశర్మే స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే 3 పాటు ఇచ్చేశారట. మరో రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్-మణిశర్మ మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన ఆ రెండు పాటల్ని కూడా తెరకెక్కిస్తారని టాక్. కాగా, ‘డబుల్ ఇస్మార్ట్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 8వ తేదీన గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఆడియో హక్కుల్ని పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. మరి.. రామ్-పూరి కలయికలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి