iDreamPost

దారుణం: ఆస్పత్రిలో డాక్టర్ ను కత్తితో పొడిచిన పేషెంట్!

దారుణం: ఆస్పత్రిలో డాక్టర్ ను కత్తితో పొడిచిన పేషెంట్!

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. కరాల్ భాగ్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో మంగళవారం ఓ రోగి చికిత్స కోసం ఓ ఆస్పత్రికి వచ్చాడు. ఆ తర్వాత వైద్యుడితో కొద్దిసేపు మాట్లాడాడు. ఇక చికిత్స అందించే క్రమంలోనే ఆ పేషెంట్ తన వెంట తెచ్చుకున్న కత్తితో డాక్టర్ పై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రిలో సిబ్బంది అతడిని పట్టుకుని ఆ డాక్టర్ ను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఆ రోగి డాక్టర్ ను కత్తితో ఎందుకు పొడిచాడు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీలోని కరాల్ భాగ్ ప్రాంతంలో డా. సత్నామ్ సింగ్ అనే న్యూరో సర్జన్ శ్రీగంగారామ్ పేరుతో ఓ ఆస్పత్రిని నడిపిస్తున్నారు. అయితే, మంగళవారం బీహార్ కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అనంతరం ఆ పేషెంట్ డాక్టర్ సత్నామ్ సింగ్ తో మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి రోగి రాజ్ కుమార్ డాక్టర్ సత్నామ్ సింగ్ ను కత్తితో పొడిచి దాడి చేశాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై పేషెంట్ రాజ్ కుమార్ పట్టుకుని ఆ డాక్టర్ ను రక్షించారు.

ఇతడి దాడిలో డాక్టర్ బొటన వేలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి గత కొంత కాలం నుంచి డిప్రెషన్ తో బాధపడుతున్నాడని, దీని కారణంగానే అతడు ఇలా చేశాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: భర్త వద్దు ప్రియుడే ముద్దు! చివరికి ట్విస్ట్ మాములుగా లేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి