iDreamPost

హైదరాబాద్ అమ్మాయిలతో APలో వ్యభిచారం..

హైదరాబాద్ అమ్మాయిలతో APలో వ్యభిచారం..

మెగా సిటీస్‌లో ఉంటే కల్చర్ ఇప్పుడు పట్టణాలకు అక్కడి నుండి నగరాలకు పాకుతోంది. ఇటీవల కాలంలో నగరాల్లో కూడా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. బాడీ థెరపీ కోసం చాలా మంది సెలూన్లు, మసాజ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మసాజ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలను తెరతీస్తున్నారు కొందరు. క్రాస్ మసాజ్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి.. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం సాగిస్తున్నారు. ఏకంగా సెక్స్ వర్కర్లతోనే వ్యాపారం మొదలు పెట్టేశారు. బాడీ థెరపీ, మసాజ్ అంటూ లోపల గలీజు దందాను నడుపుతున్నారు. అయితే ఎల్లాకాలం వీరి ఆటలు సాగవు కదా.. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మసాజ్ సెంటర్ వెనుక జరుగుతున్న భాగోతాన్ని బట్టబయలు చేశారు. అనేక మంది సెక్స్ వర్కర్లను, విటుడ్ని అరెస్టు చేశారు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందంటే పచ్చగా ఉండే మన గోదావరి జిల్లాలో.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులో గ్రెస్ సెలూన్, మసాజ్ సెంటర్ ప్రారంభించారు దాని నిర్వాహకులు. అయితే పేరుకు బాడీ థెరపీ సెంటర్ అయినప్పటికీ లోపల జరిగేవన్ని అసాంఘిక కార్యకలాపాలే. కొత్త కొత్త అమ్మాయిలను తీసుకు వచ్చి వ్యభిచారం నడిపిస్తున్నారు. అయితే ఇటీవల అమ్మాయిలు ఎక్కువ రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సదరు మసాజ్ సెంటర్ పై నిఘా వుంచిన పోలీసులు అక్కడ వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకున్నారు. ఈ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నలుగురు సెక్స్ వర్కర్లను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు, విజయవాడ, ఏలూరుకు చెందిన ఒక్కో వర్కర్ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఓ విటుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మరికొన్ని మసాజ్, సెలూన్ సెంటర్లపై దాడులు జరిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి