iDreamPost

క్రేజీ న్యూస్.. ధూమ్ 4లో షారూఖ్, రామ్ చరణ్..?

బాలీవుడ్ ధూమ్ మూవీ సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చి అలరించాయి. ధూమ్‌లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించారు. అయితే ఇప్పుడో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

బాలీవుడ్ ధూమ్ మూవీ సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చి అలరించాయి. ధూమ్‌లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించారు. అయితే ఇప్పుడో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

క్రేజీ న్యూస్.. ధూమ్ 4లో షారూఖ్, రామ్ చరణ్..?

ఓ సినిమా హిట్ అయ్యాక.. వాటిని అనుబంధంగా సిరీస్‌లు పుట్టుకు వస్తుంటాయి. ఈ కల్చర్ ఎక్కువగా హాలీవుడ్‌లో నడుస్తుంది. ఫైనల్ డెస్టినేషన్, అవెంజర్స్, గేమ్ ఆఫ్ ద థ్రోన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హ్యారీ పొటర్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, రాంగ్ టర్న్ వంటి అనేక సినిమాలు భారతీయ ప్రేక్షకులను అలరించాయి. కానీ ఇప్పుడిప్పడే ఇండియన్ మూవీస్ ఈ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాయి. దీనికి ఆద్యం పోసింది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీనే. 2004లో ధూమ్ అనే చిత్రం దీనికి పురుడు పోసింది. ఇక ఇప్పటి వరకు మూడు సిరీస్‌లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తుంది. తొలి మూడింటిని నిర్మించిన ఆదిత్య చోప్రా ఫోర్త్ సిరీస్ కోసం ప్లాన్స్ చేస్తున్నాడట.ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో  తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

ధూమ్ మూవీ సిరీస్ అంటే థ్రిల్లింగ్ బైక్ ఛేజింగ్స్, హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, స్టైలిష్ విలన్స్, చాక చక్యంగా తప్పించుకోవడం వంటివి ఉంటాయి. ఇప్పటి వరకు మూడు సిరీస్‌లు వచ్చాయి. ధూమ్‌లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ 3లో అమీర్ ఖాన్ అలరించారు. ఈ మూవీల నిర్మాణ సంస్థ యష్ రాజ్.. ఇప్పుడు నాల్గవ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నారని బీ టౌన్ మీడియా పేర్కొంటోంది. 2024లో ఈ బిగ్గెస్ట్ ఎనౌన్స్ మెంట్ రానుందని గట్టిగా వినిస్తోంది. ఇదే నిజమైతే.. తన ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కానుంది.

చరణ్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. తుఫాన్ అనే మూవీతో బీ టౌన్‌లో మెరిశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో..తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఈ మెగా వారసుడు. ఆ మూవీ బూస్టప్‌ ఇవ్వడంతో.. ఇతడిపై కన్నేసినట్లు కనిపిస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. గేమ్ ఛేంజర్ వంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్న చరణ్ .. ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాను ప్రకటించాడు. ఇటీవల తండ్రి అయిన చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక షారూఖ్.. ఈ ఏడాది మూడు చిత్రాలతో అలరించాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకున్నాయి. అలాగే ఆర్ఆర్ఆర్.. చరణ్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ సైతం హృతిక్ రోషన్‌తో వార్ 2లో నటిస్తున్న సంగతి విదితమే. మరీ ధూమ్ 4లో షారూఖ్, చరణ్ కాంబినేషన్ కన్ఫమ్ అయితే.. ఈ మూవీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి