iDreamPost

బెజవాడలో కరోనా పాజిటివ్ – మూడు రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధింపు.

బెజవాడలో కరోనా పాజిటివ్ – మూడు రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధింపు.

ఈ రోజు విజయవాడ వన్ టౌన్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సదరు కరోనా పాజిటివ్ వ్యక్తిని ఐసోలేషన్ కి తరలించి అతను ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడు , ఎవరెవర్ని కలిసాడు అన్న వివరాలు సేకరించి తదుపరి రక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ , పోలీసు యంత్రాంగం మరో ముందు జాగ్రత్త చర్యకి కూడా ఉపక్రమించింది.

విజయవాడలో హై అలర్ట్ ప్రకటించి మూడు రోజుల పాటు జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు . ప్రస్తుత విషమ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఇళ్ల నుండి బయటికి రాకుండా కర్ఫ్యూ అమలుకు సహకరించాలని కోరారు.

అంతేకాకుండా ఇది స్వచ్ఛంద కర్ఫ్యూ మాత్రమే కాదని ఈ కర్ఫ్యూని ఎవరూ అధిగమించకుండా కఠిన చర్యలు తీసుకొని నిర్బంధంగా అయినా అమలు చేస్తామని బెజవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి