iDreamPost

ఏపీలో 275 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 275 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 275  మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,071 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా 2906 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 2559 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 55 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 275 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన 76 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దానితో మొత్తం కేసులు 351 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ  అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి