iDreamPost

ఎన్నికల వేల తీవ్ర విషాదం.. కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత!

  • Published Nov 13, 2023 | 12:41 PMUpdated Nov 13, 2023 | 12:41 PM

ఎన్నికల వేళ అన్ని పార్టీ నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టు మీద ఉన్నాయి.

ఎన్నికల వేళ అన్ని పార్టీ నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టు మీద ఉన్నాయి.

  • Published Nov 13, 2023 | 12:41 PMUpdated Nov 13, 2023 | 12:41 PM
ఎన్నికల వేల తీవ్ర విషాదం.. కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత!

ఇటీవల దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, అనుభవం లేకుండా వాహనాలు నడపడం లాంటివి చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరగుతున్నాయని అధికారులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నేత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ప్రధాన పార్టీ నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సైతం గెలుపు కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ కన్నుమూశారు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ అభిమాన నాయకుడు కోలుకొని వస్తాడని భావించిన కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంగళవారం నాడు శీలం అంత్యక్రియలు జరుగుతాయని అనుచరులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి