iDreamPost

లక్నో బయలుదేరిన జగన్.

లక్నో బయలుదేరిన జగన్.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో లక్నో బయలుదేరారు. ఈ పర్యటన లొ ఆయన తోపాటు ఆయన వెంట ఇద్దరు మంత్రులు కుడా ఉన్న ఉనట్టు తెలిసింది.

ప్రముఖ ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐ-ప్యాక్ సంస్థ డైరెక్టర్ గా ఉన్న రిషి వివాహం ఈరోజు రాత్రి లక్నో లో జరగనుంది. ఈ వివాహ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మొహన్ రెడ్డి హాజరౌతున్నట్లు తెలుస్తుంది.

ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆ సంస్థ డైరక్టర్ గా వ్యవహరిరించిన రిషి తో జగన్ కు పరిచయం ఏర్పడింది. ఈ వివాహానికి ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ని ప్రశాంత్ కిషోర్ కలుసుకొనే అవకాశం ఉంది.

లక్నోలో వివాహానికి హాజరైన అనంతరం ముఖ్యమంత్రి ఈ రాత్రికి విజయవాడ తిరిగి రానున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి