iDreamPost

ఏపీ, తెలంగాణలో రైల్వే పనులకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్!

  • Author singhj Published - 08:53 PM, Wed - 16 August 23
  • Author singhj Published - 08:53 PM, Wed - 16 August 23
ఏపీ, తెలంగాణలో రైల్వే పనులకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్!

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ విషయానికొస్తే.. గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్​కు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారుగా రూ.3,238 కోట్ల అంచనా వ్యయంతో 272 కిలోమీటర్ల మేర ఈ రూట్​లో డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది.

డోన్​-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ (మొత్తంగా 502 కిలోమీటర్లు) రూట్లలోనూ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,655 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గంలో డబ్లింగ్ పనులు చేపట్టాలని డిసైడ్ అయింది. అలాగే నెర్గుండి-బారాంగ్, కుర్దా రోడ్-విజయనగరం నడుమ (417 కిలోమీటర్లు) రూ.5,618 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో రైల్వే లైన్ల విస్తరణతో పాటు ట్రైన్స్ రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడమే టార్గెట్​గా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

రైల్వే లైన్ల విస్తరణ, రాకపోకల క్రమబద్ధీకరణ, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్రం.. అందుకోసం రూ.32,500 కోట్ల అంచనా వ్యయాన్ని పెట్టుకుంది. దీంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్​, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్​వర్క్​లను విస్తరించనున్నారు. ఇక, పీఎం ఈ-బస్ స్కీముకూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోని మొత్తం 169 సిటీల్లో 10 వేల ఈ-బస్​లను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే దేశవ్యాప్తంగా 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటీ కోసం మౌలిక సదుపాయాలను పెంచాలని నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి