iDreamPost

తాళి క‌ట్టే స‌మ‌యంలో వ‌ధువు హైడ్రామా! ఆ త‌ర్వాత భ‌లే ట్విస్ట్

తాళి క‌ట్టే స‌మ‌యంలో వ‌ధువు హైడ్రామా! ఆ త‌ర్వాత భ‌లే ట్విస్ట్

మొన్న తనకు పెళ్లి వద్దని వ‌ధువు పెళ్లిమండ‌పంలో చెప్పగానే వరుడు సృహ కోల్పోయాడు. ఇలాంటి ఘటనే ఒకటి మైసూరు నగరంలో జ‌రిగింది. తాళి క‌ట్ట‌డానికి రెండు నిమషాల ముందు పెళ్లి కూతురు కళ్లు తిరిగిపడిపోయింది. హెచ్ డీ కోటకు చెందిన యువకునితో మైసూరు నగరానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. విద్యాభారతి కళ్యాణ మండపంలో పెళ్లి. ఇరువురి కుటుంబసభ్యులు హాజరయ్యారు. తాళి కట్టే సమయానికి వధువు సృహ తప్పింది. దీంతో కుటుంసభ్యుల్లో కంగారు. అనంతరం సృహలోకి వచ్చిన ఆ వధువు, తనకు పెళ్లి వద్దని చెప్పేసింది. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. తాను పక్కింటి కుర్రాడిని ప్రేమించాను, అత‌న్నే పెళ్లి చేసుకొంటాన‌ని చెప్పడంతో వ‌రుడు షాక్. కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా ఆమె వినిపించుకోలేదు.

తాము ఈ పెళ్లి కోసమని 5 ల‌క్ష‌లు ఖర్చు చేశామని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వధువు ఫ్యామిలీ డిమాండ్ చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వధువుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. వధువు మొండికేసింది. దీంతో పోలీసులు కూడా ఏమి చేయలేకపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి