iDreamPost

Bigg Boss 7: ప్రశాంత్ కి నాగార్జున సపోర్ట్.. అమర్ ని వాయించేశాడు!

Bigg Boss 7: ప్రశాంత్ కి నాగార్జున సపోర్ట్.. అమర్ ని వాయించేశాడు!

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ సరదా మొదలైపోయింది. నిజానికి ఈ వీక్ లో సరదా కంటే కంటెస్టెంట్స్ కి షంటింగ్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందుగానే ఊహించిన విధంగా.. వారంలో జరిగిన అన్ని ఘటనలను నాగార్జున ప్రస్తావించాడు. ఒక్కొక్కరికి కింగ్ మీటర్ రేటింగ్ ఇచ్చాడు. ఈ సీజన్ లో హోస్ట్ కి కూడా రేటింగ్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. దానినే కింగ్ మీటర్ అని పెట్టారు. కంటెస్టెంట్స్ ఆడిన తీరుని బట్టి నాగార్జున రేటింగ్ ఇచ్చారు. అలాగే వాళ్లు చేసిన తప్పులు, ఒప్పుల గురించి కూడా మాట్లాడాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్- అమర్ దీప్ గొడవ గురించి ప్రస్తావించారు.

నామినేషన్స్ సమయంలో హౌస్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమర్ దీప్ ఒక అడుగు ముందుకేసి ఇష్టమొచ్చిన కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ అన్నా అంటుంటే.. అమర్ దీప్ మాత్రం అరే ఒరే అంటూ రెచ్చిపోయాడు. మధ్యలో ఒక పెద్ద డైలాగు కూడా చెప్పాడు. బీటెక్ చేసి నచ్చీ నచ్చని ఉద్యోగంలో చేరి డబ్బులు చాలక, ఉద్యోగం ఇష్టంలేక ఎంత మంది కష్టపడుతున్నారో తెలుసా? చాలామంది చచ్చిపోతే కనీసం శవాలు కూడా దొరకలేదు అంటూ గుక్కతిప్పుకోకుండా డైలాగు చెప్పాడు. అలాగే ఆటో డ్రైవర్లు, రిక్షా తొక్కేవాళ్ల కష్టాలను అడ్రస్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ.. రైతు బిడ్డ రైతులకు సహాయం చేస్తాను అనడంలో తప్పు ఏముంది? అనే ప్రశ్న అప్పుడే రైజ్ అయింది.

అమర్ దీప్ అలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ ఫైట్ మాత్రం అమర్ దీప్ కు చాలానే మైనస్ అయింది. ఇంకా ఆ ఇంపాక్ట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే విషయంలో నాగార్జునా కూడా స్పందించాడు. మొదటివారంలో ప్రేక్షకులు నిరాశ పడ్డారు. ఈ వీక్ నేను ఏం చేయాలి అంటూ నాగార్జున ప్రశ్నించాడు. అందుకు అమర్ దీప్ నేను ఈ వీక్ ఆడాను సార్ అని సమాధానం చెబుతాడు. తర్వాత ప్రశాంత్ తో గొడవను ప్రస్తావిస్తూ.. ఒక పెద్ద మోనో లాగ్ చెప్పావ్. అసలు దాని రెలవెన్స్ ఏంటి? మాకు చెప్పు ఒకసారి అని ప్రశ్నిస్తాడు. ఒక రైతు బిడ్డ వెళ్లి రైతు బిడ్డకే ఇవ్వాలని రూల్ ఏముంది సార్? అని అమర్ దీప్ ప్రశ్నిస్తాడు. అందుకు నాగార్జున వెంటనే అది అతని ఇష్టం.. అతను సంపాదించుకున్న డబ్బు అంటూ సమాధానం చెబుతాడు.

ఈ దెబ్బతో ప్రశాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ గొడవలో అమర్ దీప్ దే తప్పు అంటూ వాళ్లు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. చాలా మంది ఈ గొడవ గురించి నాగార్జున ఏం మాట్లాడతారు అని ఎదురుచూశారు. అందరూ ఊహించిన విధంగానే నాగార్జున పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసి అమర్ దీప్ కి క్లాస్ పీకాడు. అంతేకాకుండా అమర్ దీప్ ఈ వీక్ లో కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఇంక హౌస్ లో ఉన్న అందరికి నాగార్జున కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు. శివాజీని ముందు పొగుడుతున్నట్లు పొగిడి ఆ తర్వాత క్లాస్ పీకేశాడు. పద్దాక తలుపులు తీయండి వెళ్లిపోతాను అని ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అలాగే ప్రియాంక జైన్ ని కూడా నీ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు అంటూ నాగార్జున షాకిచ్చాడు. పల్లవి ప్రశాంత్ కి నాగార్జున సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి