iDreamPost

హయత్ నగర్ బాలిక కిడ్నాప్ కేసు.. అసలు కథ వేరే ఉంది!

హయత్ నగర్ బాలిక కిడ్నాప్ కేసు.. అసలు కథ వేరే ఉంది!

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు అపహరించి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఆ తర్వాత రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ రాగా ఒక హిజ్రా ఆమెకు సహాయం చేసింది. పోలీసులకు సమాచారం అందివ్వగా వారు ఆ  బాలికను కాపాడారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, చివర్లో ఒక సినిమాటిక్ ట్విస్ట్ వెలుగు చూసింది.

పెద్ద అంబర్ పేట పరిధిలో రాత్రి 10 గంటలకు ఒక బాలిక బయటకు రాగా.. ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ఆమెను అపహరించారు. ఆ బాలికపై అఘాయిత్యానికి యత్నించగా.. ఆమె పారిపోయి హిజ్రా సాయంతో బయటపడింది. నిన్నటి వరకు అంతా ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైందని.. ఆ బాలిక లక్కీగా బయటపడిందని అంతా అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో అసలు కథ బయటకు వచ్చింది. ఆ తర్వాతే అర్థమైంది.. ఇప్పటివరకు విన్నది వేరని.. అసలు కథ వేరే ఉందని తెలిసింది.

పోలీసులకు ఆ బాలిక చెప్పింది మొత్తం కట్టు కథగా తేలింది. అసలు కథ ఏంటంటే.. ఆ బాలికకు కొద్ది రోజుల క్రితం స్నాప్ చాట్ లో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. వారు మాటలు దాటి ఫొటోలు కూడా మార్చుకున్నారు. ఇంకా చనువు పెరగడంతో బయట ఎక్కడన్నా కలుసుకోవాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రెండ్రోజుల క్రితం బాలిక బయటకు వచ్చింది. ఆమెను యువకుడు బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.

ఆ తర్వాత ఆ బాలిక ఏడ్చుకుంటూ హిజ్రా వద్దకు వెళ్లి తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని.. అఘాయిత్యానికి యత్నించారంటూ చెప్పుకుని ఏడ్చింది. ఆమె అంతా నిజమని నమ్మి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికను క్షేమంగా తీసుకెళ్లారు. తర్వాత విచారణ చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె ఆ నాటకం ఎందుకు ఆడింది? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. అయితే అంత రాత్రి బయటకు వచ్చింది కాబట్టి.. తిరిగి నేరుగా ఇంటికి వెళ్తే తల్లిందడ్రులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆ నాటకం ఆడి ఉంటుందని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి