iDreamPost

‘భోళా శంకర్’ రిలీజ్​పై వీడిన సస్పెన్స్.. కోర్టు ఏమందంటే..?

  • Author singhj Published - 08:37 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 08:37 PM, Thu - 10 August 23
‘భోళా శంకర్’ రిలీజ్​పై వీడిన సస్పెన్స్.. కోర్టు ఏమందంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రిలీజ్​కు రెడీ అవుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్​తో అభిమానుల్లో చిరు జోష్ నింపారు. ప్రమోషన్స్​ కూడా హిట్ అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ టైమ్​లో ‘భోళా శంకర్’ రిలీజ్​ను ఆపేయాలంటూ ఒకరు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తనను మోసం చేశారంటూ ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ‘భోళా శంకర్​’ విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు. దీంతో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా? అనే సందేహం ఏర్పడింది.

నిర్మాత అనిల్ సుంకరపై వైజాగ్ సతీష్ వేసిన పిటిషన్​ను సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ‘భోళా శంకర్’ రిలీజ్​కు లైన్ క్లియర్ అయింది. ఆగస్టు 11న మెగాస్టార్ నయా మూవీ వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా విడుదల కానుంది. ఇక కాంట్రవర్సీ విషయానికొస్తే.. ‘భోళా శంకర్’ ప్రొడ్యూసర్​గా ఉన్న ఏకే ఎంటర్​టైన్​మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. తనకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని విశాఖపట్నానికి చెందిన గాయత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ హైదరాబాద్​లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూషన్​కు సంబంధించి అనిల్ తనకు ఇంకా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉందని ఆయన ఆరోపించారు.

అనిల్ సుంకర నుంచి తనకు రావాల్సిన బకాయిలు క్లియర్ అయ్యేంత వరకు ‘భోళా శంకర్’ రిలీజ్​ను నిలిపివేయాలని కోర్టును కోరారు వైజాగ్ సతీష్​. ఈ న్యూస్ తెలియడంతో మెగా ఫ్యాన్స్​లో ఈ మూవీ ఆగస్టు 11న విడుదల అవుతుందా.. లేదా? అదే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పిటిషన్​పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు.. అనిల్ సుంకరకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, కోర్టులో సతీష్ నకిలీ పత్రాలను సమర్పించారని ఏకే ఎంటర్​టైన్​మెంట్స్ సంస్థ ఆరోపించింది. మొత్తానికి ‘భోళా శంకర్’ రిలీజ్​కు లైన్ క్లియర్ అవడంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి