iDreamPost

4 నెలల్లో రామమందిర నిర్మాణం.. అమిత్ షా

4 నెలల్లో రామమందిర నిర్మాణం.. అమిత్ షా

జార్ఖండ్ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. కేవలం 4 నెలలో అయోధ్యలో అద్భుతమైన రామమందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ అయోధ్య నిర్మాణాన్ని అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేసిందని విమర్శలు చేసారు. రామమందిరం విషయమై వేసిన రివ్యూ పిటీషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్మాణానికి తలెత్తిన అడ్డంకులన్నీ తొలగిపోయాయని, రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లుఅమిత్ షా ప్రకటించారు. రామమందిర నిర్మాణాన్ని 2.7 ఎకరాలల్లో నిర్మించనున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి