iDreamPost

నందిగం సురేష్ లక్ష్యంగా మరోసారి దాడి

నందిగం సురేష్ లక్ష్యంగా మరోసారి దాడి

ఈ నెల మూడో తేదీన నందిగామలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి మరువక మునుపే ఈ రోజు అమరావతి దారిలోని లేమల్లె వద్ద కారెక్కబోతున్న ఎంపీ సురేష్ పై ఓ భారీ మహిళ ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎంపీని సిబ్బందిని అడ్డగించి జై అమరావతి నినాదాలు చేశారు .

Read Also : టీడీపీ సోషల్ మీడియా ముందస్తు ప్రణాళికతోనే నందిగం సురేష్ మీద దాడి చేశారా?

భద్రతా సిబ్బంది , ఎంపీ అనుచరులు అల్లరి చేస్తున్న వారిని తప్పించి ఎంపీని సురక్షితంగా కారు ఎక్కిస్తుండగా సదరు మహిళల్లో కొందరు తమ వెంట తెచ్చుకున్న పొట్లాల్లోని కారప్పొడిని ఎంపీ సిబ్బంది పై చల్లి , బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని సంఘటనా స్థలిలో తీసిన వీడియోలలో తెలుస్తుంది .

Read Also : మనదే బాధా? మరి వాళ్ళదో?

కాగా ఈ దుర్ఘటనలో సన్నీ అనే యువకుడు , మరి కొందరి కళ్ళల్లో కారం పడి చికిత్స తీసుకొంటున్నారని సమాచారం . ఈ ఘటనకు నాయకత్వం వహించిన మహిళ రమా దోనెపూడి అనే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి