iDreamPost

మైనర్ బాలికకు నరకం చూపించిన ఆర్మీ మేజర్, భార్య! 6 నెలలుగా బంధించి..!

మైనర్ బాలికకు నరకం చూపించిన ఆర్మీ మేజర్, భార్య! 6 నెలలుగా బంధించి..!

హిమాచల్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆర్మీ మేజర్, అతని భార్యతో కలిసి ఓ మైనర్ బాలికకు నరకం చూపించారు. వారి కూతురి ఆలనా, పాలన కోసం ఓ 16 ఏళ్ల బాలికను వెంట తీసుకెళ్లి ఇంట్లో పనులన్నీ చేయించున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ బాలికను చిత్ర హింసలకు గురి చేస్తూ తిండి కూడా పెట్టకుండా ఆమెపై దాడికి దిగి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మీలో మేజర్ అయిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఉద్యోగ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ఈ చిన్నారిని చూసుకునేందుకు ఓ అమ్మాయి కావాలని భావించి అసోంకు చెందిన ఓ 16 ఏళ్ల బాలికను హిమాచల్ ప్రదేశ్ కు వారి ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ బాలికను ఇంట్లోని పనులన్నీ చేయించుకునేవారు. ఇంతే కాకుండా ఆ అమ్మాయిని ఇష్టమొచ్చినట్లు దాడి చేయడం, టైమ్ కు భోజనం పెట్టకపోవడం, చివరికి డస్ట్ బిన్ లో పడి ఉన్న తినే పదర్థాలను ఆ బాలికకు ఆహారంగా ఇచ్చేవారట.

ఈ దంపతులు ఆ బాలికను దాదాపు 6 నెలల పాటు ఇంట్లో బంధించి నరకం చూపించారు. ఇక మొత్తానికి ఆ బాలిక ఆ దంపతుల నుంచి బయటపడి తన ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు పూస గుచ్చినట్లు వివరించింది. ఇక బాధితురాలి తల్లి ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తూ ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి