iDreamPost

TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..

  • Published Mar 31, 2024 | 5:30 PMUpdated Mar 31, 2024 | 6:08 PM

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 5:30 PMUpdated Mar 31, 2024 | 6:08 PM
TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ వేళ.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వేళ.. అచ్చెన్నాయుడు కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఆయన మాతృమూర్తి ఆదివారం నాడు మృతి చెందారు. అచ్చెన్నాయుడి తల్లి కళావతమ్మ (90) ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే వయోభారం కారణంగా కళావతమ్మ అనారోగ్యం బారిన పడ్డారు. దానికి చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు.

ఇదిలా ఉంటే కళావతమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు అయిన ఎర్రన్నాయుడు సుమారు 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక కళావతమ్మ భర్త, అచ్చెన్నాయుడి తండ్రి దాలినాయుడు 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. ఇక కళావతమ్మ రెండో కుమారుడు హరివరప్రసాద్‌ కోటబొమ్మాళి పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడో కుమారుడు ప్రభాకర్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇక కళావతమ్మ మృతి పట్ల టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా.. రేపు ఉదయం అచ్చెన్న ఇంటికి చంద్రబాబు వెళ్తారని తెలుస్తోంది. విషయం తెలియాగానే అచ్చెన్నాయుడు ఇంటికి ప్రయాణం అయ్యారు. ఇక కళావతమ్మ సంతానం, మనవళ్లు, మనవరాళ్లు అందరూ రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ కూడా చేస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి