iDreamPost

విశాఖలో ప్రధాని మోదీ.. బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ అదుర్స్..

విశాఖలో ప్రధాని మోదీ.. బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ స్పీచ్ అదుర్స్..

విశాఖలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ ప్రారంభం అయింది. ఈ సభలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దేశ ప్రగతి రధ సారధి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం. ఉత్తరాంధ్ర గడ్డపై ప్రధానికి ఘన స్వాగతం తెలుపుతున్నాం. ఇక్కడకు లక్షల మంది కదిలొచ్చారు. విశాఖ మొత్తం జనసంద్రం కనిపిస్తుంది.

కార్తీక పౌర్ణమి నాడు ఎగిసిపడే కెరటాలకు మించి జనకెరటాలు ఉవ్వెతున ఎగిసిపడుతున్నారు. ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. వికేంద్రీకరణ పారదర్శకతతో పాలన కొనసాగిస్తున్నాం. మోడీతో అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం. సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి.. ఏపీని ఆదుకోవాలి.. ఏం పిల్లాడో వెళదాం వస్తవా అంటూ వంగపండు పాటను గుర్తు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి