iDreamPost

CM Jagan: మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు హాజరు కానున్న సీఎం జగన్‌

  • Published Jan 18, 2024 | 10:15 AMUpdated Jan 18, 2024 | 10:15 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు తన సోదరి షర్మిల ఇంటికి రానున్నారు. మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థం వేడకలో పాల్గొననున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు తన సోదరి షర్మిల ఇంటికి రానున్నారు. మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థం వేడకలో పాల్గొననున్నారు. ఆ వివరాలు..

  • Published Jan 18, 2024 | 10:15 AMUpdated Jan 18, 2024 | 10:15 AM
CM Jagan: మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు హాజరు కానున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు అనగా జనవరి 18, గురువారం నాడు హైదరాబాద్‌ రానున్నారు. ఇంత సడెన్‌గా ప్రయాణం ఏంటి అంటే.. నేడు జగన్‌ మేనల్లుడు, తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం. ఈ వేడుకలో పాల్గొనేందుకు గాను సీఎం జగన్‌.. నేడు హైదరాబాద్‌ రానున్నారు. దీనిలో భాగంగా.. గురువారం సాయంత్రం 6 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రోడ్డు మార్గంలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో పాల్గొని.. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లికి పయనమవుతారు జగన్‌.

కొన్ని రోజుల క్రితం తన కుమారుడి వివాహం గురించి షర్మిల స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆమె తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ నివాసంలో ఆయనను కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు రావాలని సోదరుడు జగన్‌ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే నేడు సీఎం జగన్‌ హైదరాబాద్‌ రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం షర్మిల తన వైఎస్సార్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

cm jagan went for sharmila son engagement

ఇక రాజా రెడ్డి అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సును పూర్తి చేశారు. యూనివ‌ర్సిటీ నుంచి ఇటీవల ప‌ట్టా కూడా అందుకున్నారు. ఈ క్రమంలో రాజారెడ్డి కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల, అనిల్ కుమార్, విజయమ్మ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక షర్మిలకు కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది అని సమాచారం. ఇక నాలుగేళ్ల క్రితం వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. వీరిద్దరూ చర్చ్‌మేట్స్‌ కూడా. నేడు రాజా రెడ్డి-ప్రియా అట్లూరిల నిశ్చితార్థ వేడుక జరగనుండగా.. సరిగ్గా నెల రోజుల తర్వాత అనగా ఫిబ్రవరి 17న వారి పెళ్లి జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి