iDreamPost

Akhanda : పుష్ప పొరపాటు బాలయ్య సినిమా చేయలేదు

Akhanda : పుష్ప పొరపాటు బాలయ్య సినిమా చేయలేదు

పుష్ప పార్ట్ 1 ది రైజ్ కేవలం 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వడం వల్ల థియేట్రికల్ రెవిన్యూ మీద దెబ్బ పడేలా చేసుకున్నారు కానీ ఈ విషయంలో అఖండ మాత్రం చాలా తెలివైన పని చేసింది. దీని స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న డిస్నీ హాట్ స్టార్ ఈ నెల 21న ప్రీమియర్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక అభిమానికి ఇచ్చిన సమాధానంలో అఫీషియల్ గా ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా 12 లేదా 14న వస్తుందన్న ఊహాగానాలకు దీంతో చెక్ పెట్టేశారు. పండగ పూట ఇంట్లోనే బాలయ్య సినిమాతో ఎంజాయ్ చేద్దామనుకున్న హోమ్ ఆడియన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే కానీ అభిమానులకు మాత్రం ఖచ్చితంగా శుభవార్తే.

ఇది ఎలా అడ్వాంటేజ్ కానుందో చూద్దాం. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ తప్పుకోవడంతో ఇప్పుడు సంక్రాంతికి చెప్పుకోదగ్గ సినిమాగా ఒక్క బంగార్రాజు మాత్రమే మిగిలింది. నాగార్జున కూడా పరిస్థితులు అన్నీ బాగుంటే 14 ఖచ్చితంగా వస్తామని చెప్పారు కానీ ఏది ఎలా ఉన్నా వచ్చే తీరతామని చెప్పలేదు. సో ఇన్ డైరెక్ట్ గా కరోనా కేసులు పెరిగి ఆంక్షలు కఠినమైతే వాయిదా తప్పదనే హింట్ ఇన్ డైరెక్ట్ గా ఉంది. మొత్తానికి థియేటర్లు మూతబడటం ఉండకపోవచ్చు. ఈ లెక్కన బిసి సెంటర్స్ లో అఖండకు మళ్ళీ ఇంకోసారి స్ట్రాంగ్ రన్ దక్కడం ఖాయం. పుష్ప డిజిటల్ లో వచ్చేసి ఉంటుంది కాబట్టి దాని ప్రభావం అది ఆడుతున్న థియేటర్ల మీద పడుతుంది.

సో మాస్ ఆడియన్స్ కి అఖండ మళ్ళీ ఛాయస్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. చాలా చోట్ల 50 రోజుల రన్ కు ఎగ్జిబిటర్లు అంగీకరించినట్టు సమాచారం. ఇదే జరిగితే చాలా ఏళ్ళ తర్వాత చెప్పుకోదగ్గ కౌంట్ లో తెలుగు సినిమాకు ఫిఫ్టీ డేస్ పోస్టర్ పడుతుంది. హైదరాబాద్ తో సహా పలుచోట్ల ఈ వీకెండ్ కి అఖండ థియేటర్లు మరిన్ని పెంచబోతున్నారు. ఇదంతా ఊహించని ఫలితమే. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాకు రెడీ అవుతున్న బాలయ్యకు విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ఎంపిక కావడం హైప్ ని పెంచేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ ని నిన్న అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే

Also Read : RC15 : మెగా మూవీలో శాండల్ వుడ్ హీరో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి