iDreamPost

నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉంది! కోర్టుకెక్కిన భార్య!

  • Published Feb 01, 2024 | 2:14 PMUpdated Feb 01, 2024 | 2:14 PM

ఈ మధ్యకాలంలో చాలామంది వైవాహిక జీవితంలో అక్రమ సంబంధాలను పెట్టుకోని పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకాంగ పెద్ద సంఖ్యలోనే అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నడు. ఆ విషయం తెలుసుకున్న భార్య తన భర్తకు ఊహించని షాక్ ని ఇచ్చింది. అదేమిటంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది వైవాహిక జీవితంలో అక్రమ సంబంధాలను పెట్టుకోని పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకాంగ పెద్ద సంఖ్యలోనే అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నడు. ఆ విషయం తెలుసుకున్న భార్య తన భర్తకు ఊహించని షాక్ ని ఇచ్చింది. అదేమిటంటే..

  • Published Feb 01, 2024 | 2:14 PMUpdated Feb 01, 2024 | 2:14 PM
నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉంది! కోర్టుకెక్కిన భార్య!

ప్రతిఒక్కరికి వైవాహిక జీవితం అనేది మూడు పువ్వలు, ఆరు కాయలుగా సుఖ సంతోషంగా ఉండాలి. కానీ, ప్రస్తుత కాలంలో దాంపత్య జీవితం అనేది ఎడారిలో ఎండమావులా ఉంటుంది. దూరం నుంచి సఖ్యతగా కనిపించిన, ఇరువురి మధ్య మాత్రం చాలా కలహాలు,ఆపోహలు, అక్రమ సంబంధాలతో నిండివుంటుంది. అయితే ఏ వైవాహిక జీవితంలోనైన గొడవలనేవి సహజం. అవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ, ఈ అక్రమసంబంధాలు అనేవి మాత్రం పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటాయి. కుటుంబాలనే చిన్న భిన్నం చేస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఏక్కడ చూసిన ఇలాంటి వివాదలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా, దాంపత్య జీవితంలో మూడో వ్యక్తిని ఆహ్వానించి లేని పోని సుఖ సంతోషలకు బానిసలు అయ్యే వ్యక్తులను ఎంతోమందిని చూసి ఉంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకాంగా 500 మందితో అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య ఒక్కసారిగా షాక్ గురైయింది. ఆ తర్వాత ఆమె తన భర్తకు ఊహించని షాక్ ని ఇచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే ఓ వివాహిత తన భర్తకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో తన భర్త 500 మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అసలు ఏం జరిగిందంటే.. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌‌లో తంజావూరుకి చెందిన ఆర్తి అనే మహిళకు వివేక్‌రాజ్‌ అనే వ్యక్తితో గత కొంతకాలం క్రితం వివాహం అయ్యింది. కాగా, తన భర్త బ్యాంకులో పనిచేస్తుడని, ఇటీవలే ఆయన మొబైల్ ఫోన్‌‌ చూడగా.. అందులో తనకు పలు అసభ్యకర వీడియో కాల్‌ స్క్రీన్‌షాట్‌లతో పాటు అసభ్యకరమైన ఫొటోలు కనిపించాయని తెలిపింది. ఇక ఆ మొబైల్ లో 500 నుంచి 1000 వరకు అసభ్యకర వీడియోలు ఉన్నాయని ఆర్తి పేర్కొంది. దీనితో పాటు తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అందులో ఎక్కువగా కాలేజీ అమ్మాయిలు ఉన్నారని చెప్పింది. ఈ విషయం గురించి వివేక్ రాజ్, ఆయన తల్లిదండ్రులను నిలదీయడంతో.. బయటపెడితే చంపెస్తామని బెదిరించినట్లు వివరించారు. కనుక దీనిపై పోలీసుల విచారణ సరిపోదని, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆ వివాహిత కోరింది. కాగా, తన భర్తకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్‌.. మంగళవారం విచారణకు వచ్చింది.

My husband has relationship with 500 women

కాగా, గతంలో తాను రెండో నెల గర్భంతో ఉన్నప్పుడు.. తనపై భర్త, అత్తమామలు దాడిచేయడం వల్ల అబార్షన్‌ అయ్యిందని వాపోయింది. అయితే ఈ విషయంపై తంజావూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలే ఆదేశాలు ఇవ్వాలని ఆ మహిళ న్యాయస్థానంలో కోరింది. ఇక ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సుకుమార గురు.. తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీలకు నోటీసులు జారీచేసి,సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ వాయిదా వేశారు. మరి, 500 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి