iDreamPost

YS షర్మిలకు కాబోయే కోడలితో విజయమ్మ.. ? ఎవరీ ప్రియా అట్లూరి?

  • Published Dec 12, 2023 | 8:49 PMUpdated Dec 13, 2023 | 12:50 PM

YS Raja Reddy Lover Priya Atluri Background: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి గురించి తెలిసిందే. ఆయన మ్యారేజ్​పై ఇప్పుడు అందరిలోనూ చాలా ఆసక్తి నెలకొంది.

YS Raja Reddy Lover Priya Atluri Background: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి గురించి తెలిసిందే. ఆయన మ్యారేజ్​పై ఇప్పుడు అందరిలోనూ చాలా ఆసక్తి నెలకొంది.

  • Published Dec 12, 2023 | 8:49 PMUpdated Dec 13, 2023 | 12:50 PM
YS షర్మిలకు కాబోయే కోడలితో విజయమ్మ.. ? ఎవరీ ప్రియా అట్లూరి?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల-అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజా రెడ్డి త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఆయన మ్యారేజ్​ కు సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలిసింది. దీంతో అసలు రాజా రెడ్డి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఎంతో పేరు, ప్రతిష్టలు ఉన్న వైఎస్ కుటుంబంలోకి వచ్చే ఆ అదృష్టవంతురాలు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉండటం కామనే. దీంతో రాజా రెడ్డితో జీవితాన్ని పంచుకోబోయే పెళ్లి కూతురు బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రాజా రెడ్డిని మ్యారేజ్ చేసుకోబోయే పెళ్లి కూతురి పేరు ప్రియా అట్లూరి అనేది తెలిసిందే.

ప్రియా అట్లూరి పేరు తెలియడంతో వైఎస్ ఫ్యామిలీని ఇష్టపడేవారు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రియ మరెవరో కాదు.. ఎంతో ఫేమస్ అయిన చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి మనవరాలు. ఆమె ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ఆ దేశ పౌరసత్వం కూడా ప్రియాకు ఉందని అంటున్నారు. రాజారెడ్డి-ప్రియా అట్లూరి నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోబోతోందీ అందమైన జంట. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రాజా రెడ్డి యూఎస్​ కు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం అయ్యారట. అది కాస్తా ఆ తర్వాత స్నేహంగా.. క్రమంగా ప్రేమకు దారి తీసిందని సమాచారం.

ప్రియా అట్లూరితో రాజా రెడ్డి వివాహానికి వైఎస్ షర్మిలతో పాటు ఇటు అనిల్ కుమార్ దంపతులు ఓకే చెప్పారు. అలాగే ప్రియ కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే సంవత్సరం మే నెలలో మ్యారేజ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. యూఎస్ ​లోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్​ కోర్సును పూర్తి చేశారు రాజా రెడ్డి. అదే వర్సిటీ నుంచి ఇదివరకే పట్టా అందుకున్నారు. కాన్వకేషన్ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల దంపతులు ఇదివరకే అమెరికాకు వెళ్లారు. కాగా, తాజాగా ప్రియా అట్లూరిని వైఎస్ విజయమ్మ కలిశారు. లోటస్​ పాండ్​ లోని ఇంటికి వచ్చిన ప్రియను ఆమె ఆప్యాయంగా స్వాగతించారు. కాగా ప్రియ-విజయమ్మ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రియా అట్లూరికి విజయమ్మ బంగారు గాజుల్ని ప్రజెంట్ చేస్తూ కనిపించారు. తన మనవడికి కాబోయే భార్యకు స్వయంగా ఆమె వాటిని తొడిగారు.

ఇదీ చదవండి: స్మితా వెళ్లి.. ఆమ్రపాలి రాబోతున్నారా? రేవంత్ కి ఓ లెక్క ఉంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి