iDreamPost

మ‌గ సంతానంకోసం, భార్య‌ను అందరి ముందు న‌గ్నంగా స్నానం చేయించిన భ‌ర్త‌, కేసు న‌మోదు

మ‌గ సంతానంకోసం, భార్య‌ను అందరి ముందు న‌గ్నంగా స్నానం చేయించిన భ‌ర్త‌, కేసు న‌మోదు

మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ మహిళను మగబిడ్డను క‌నాల‌ని భ‌ర్త, అత్త‌మామ‌లు ఒత్తిడిచేశారు. స్థానికంగా ఉండే ఓ మాంత్రికుడు చెప్పాడ‌ని “ఆచారం”లో భాగంగా జ‌నం ముందు నగ్నంగా స్నానం చేయమని, ఆమె భర్త, అత్తమామలు బలవంతం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మహిళ ఫిర్యాదుతో, పూణె పోలీసులు భర్త, అత్తమామలు, క్షుద్ర‌మాంత్రికుడు మౌలానా బాబా జమాదార్ నలుగురిపై ఎఫ్‌ఐఆర్ మోదు చేశారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్‌లతో పాటు మహారాష్ట్ర నినవ బలి నిర్మూలన సెక్షన్ 3, ఇతర అమానవీయ, అఘోరీ పద్ధతుల వ్య‌తిరేక కేసులూ న‌మోదు చేశారు. ఈ నలుగురిపై మ్యాజిక్ యాక్ట్, 2013 ప్ర‌కారం కేసులు న‌మోదు అయ్యాయి.

తన అత్తమామలు 2013 నుండి కట్నం కోసం వేధిస్తున్నార‌ని, మగబిడ్డను క‌న‌మ‌ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆ మహిళ‌ ఫిర్యాదుచేసింది. ఎవ‌రెవ‌రో తాంత్రిక స్వాములు చెప్పన‌ట్లు ఆమె అనేక పూజ‌లు, క్ర‌తువులు చేసేట‌ట్లు భ‌ర్త ఒత్తిడిచేశాడంట‌.

ఆ తాంత్రికుడైతే ఆ మ‌హిళ‌ జలపాతం క్రింద బహిరంగంగా స్నానం చేస్తే ఆమెకు మగబిడ్డ పుడుతుంద‌ని భ‌ర్త, అత్తమామ‌ల‌కు చెప్పాడు. అదికూడా అంద‌రికీ క‌నిపించేలా వివ‌స్త్ర‌గా స్నానం చేయాలంట. అంద‌రూ చూడాలంట‌. ఈ విష‌యాన్ని ఆ మ‌హిళ ఫిర్యాదులో పేర్కొంది.

తన ఆస్తిపై రూ. 75 లక్షల రుణం తీసుకునేందుకు, తన భర్త తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కూడా మహిళ ఆరోపించిందని పోలీసులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి