iDreamPost

ఒంటరిగా భర్త, డ్రైవర్ తో భార్య! మొగుడు చేసిన పనికి ఖంగుతిని..!

ఒంటరిగా భర్త, డ్రైవర్ తో భార్య! మొగుడు చేసిన పనికి ఖంగుతిని..!

ఇతని పేరు దాసరి హనుమంతరావు, ఇతనికి ఓ కూతరు, కుమారుడు సంతానం. ఇద్దరూ బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. హనుమంతరావు మాత్రం తన భార్యతో కలిస విజయవాడలో ఉంటున్నాడు. ఇతను మాత్రం బిల్డర్ గా కొనసాగుతున్నారు. అలా కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి భార్యాభర్తలు వేరు వేరుగా ఉంటున్నారు. భార్యను వదిలి ఉండలేక భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా హనుమంతరావు ఆత్మహత్య చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే? అంతకన్న ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచనలంగా మారుతోంది. అందులో ఏముందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ తూర్పు కృష్ణలంకలో దాసరి హనుమంతరావు-రాధాలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వీళ్లు బాగా చదువుకుని ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడ్డారు. హనుమంతరావు మాత్రం స్థానికంగా బిల్డర్ గా కొనసాగుతూ ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు తెలుస్తుంది. ఇకపోతే.. గత కొంత కాలంగా విభేదాలు కారణంగా భార్యాభర్తలు వేరు వేరుగా ఉంటున్నారు. దీంతో హనుమంతరావు తీవ్ర మనస్థాపానికి గురై తరుచు బాధపడుతూ ఉండేవాడు.

అయితే, సోమవారం ఉదయం కూతురు తండ్రికి ఫోన్ చేసింది. కానీ, అతడు ఎంతకు స్పందించలేదు. దీంతో కంగారుపడ్డ కూతురు వెంటనే వాచ్ మెన్ కు ఫోన్ చేసి తండ్రి గదిలోకి వెళ్లమని చెప్పింది. అతడు వెళ్లి చూసే సరికి.. హనుమంతరావు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసి వాచ్ మెన్ షాక్ గురయ్యాడు. జరిగిందంతా అతని కూతురికి వివరించడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని కిందకు దించారు. ఇక ఇంట్లో పరిశీలించగా.. పోలీసులకు హనుమంతరావు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.

అందులో ఏముందంటే? గత కొన్ని రోజుల నుంచి నాకు, నా భార్యకు విభేదాలు రావడంతో ఇద్దరం వేరు వేరుగా ఉంటున్నాం. మా వద్ద పని చేసే డ్రైవర్ తో నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను మానసికంగా వేధించింది. ఇంతే కాకుండా నా ఆస్తులన్నీ ఆమె పేరు మీద రాయించుకుందని ఆయన అందులో పేర్కొన్నాడు. నా చావుకి కారణం నా భార్య, మరో ఇద్దరు వ్యక్తులు అని వారి పేర్లు హనుంతరావు సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త చేసిన పనికి అతని భార్య ఒక్కసారిగా షాక్ గురైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి