iDreamPost

పదేళ్ల చిన్నారికి వివాహం.. దాని వెనక కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

  • Published Aug 09, 2023 | 12:42 PMUpdated Aug 09, 2023 | 12:42 PM
  • Published Aug 09, 2023 | 12:42 PMUpdated Aug 09, 2023 | 12:42 PM
పదేళ్ల చిన్నారికి వివాహం.. దాని వెనక కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

బాల్య వివాహం నేరమని అందరికి తెలుసు. చదువుకునే వయసులో పిల్లలకు వివాహం చేస్తే.. శారీరకంగా, మానసికంగా వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అందుకే ప్రభుత్వాలు బాల్య వివాహాలను అరి కట్టడం కోసం అనేక కఠిన చట్టాలను తీసుకువచ్చాయి. ఈమధ్య కాలంలో చాలా మంది చిన్నారులు పోలీసులు సాయంతో బాల్య వివాహాల బారి నుంచి తప్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన చెప్పుకోబోయే బాల్య వివాహం మాత్రం ఇందుకు భిన్నమైంది. తల్లిదండ్రులు.. ప్రభుత్వ అనుమతితో బంధు మిత్రలుందరి సమక్షంలో పదేళ్ల తమ కుమార్తెకు వివాహం చేశారు. మరి పెళ్లి అంటే ఎంత సందడిగా ఉండాలి. కానీ ఈ పెళ్లి మండపంలో ఎక్కడ చూడు విషాద చాయలే అలుముకుని కనిపిస్తాయి. అసలు ఈ వివాహం చేయడం వెనక ఉన్న కారణం తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ఆ వివరాలు..

పైన ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి పేరు ఎమ్మా ఎడ్వర్డ్‌(10). ఉత్తర కరోలినాలోని అలీనా(39), ఆరోన్‌ ఎడ్వర్డ్స్‌ (41)ల దంపతుల ఒక్కగానొక్క సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఊహించని పెను విషాదం వారి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారి ఎమ్మా క్యాన్సర్‌ బారిన పడింది. ఆ పసిపాప ఎన్నో రోజులు బతకదని వైద్యులు తేల్చి చెప్పారు. తమ ప్రాణం తమను విడిచిపోతుందని తెలిసిన నాటి నుంచి ఆ తల్లిదండ్రులు అనుభవిస్తోన్న గుండెకోతను వర్ణించడానికి మాటలు లేవు. బిడ్డ ప్రాణాల కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ  చిన్నారికి వ్యాధి ముదిరిందని.. ఆమె కొన్ని రోజులు మాత్రమే బతుకుతుందని వైద్యులు తెలిపారు.

తాము ఎంత ఏడ్చినా జరగబోయే దారుణాన్ని ఆపలేమని ఎమ్మా తల్లిదండ్రులకు అర్థం అయ్యింది. బిడ్డకు తమకు దూరం అయ్యాక ఎలాగు జీవితాంతం ఏడావాల్సిందే. కనీసం తను బతికి ఉన్నన్ని రోజులైనా తనను సంతోషంగా ఉంచాలని భావించారు. ఎమ్మా ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఎప్పుడూ నాకు పెళ్లి చేయండి అంటూ తల్లిదండ్రులను కోరేది. బిడ్డ మరి కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసి.. ఎమ్మా తల్లిదండ్రులు ఆమె కోరికను నిజం చేయాలనుకున్నారు. వెంటనే కుమార్తె స్నేహితుడి తల్లిదండ్రులతో మాట్లాడి.. విషయం వివరించడంతో వారు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. ఈ సమయంలో స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎడ్వర్డ్స్ కుటుంబానికి అండగా నిలిచి తమవంతు సాయం చేశారు.

జూన్‌ 29న బంధుమిత్రుల సమక్షంలో ఎమ్మాకు.. తన స్నేహితుడు డేనియల్ మార్షల్ క్రిస్టోఫర్ విలియమ్స్ జూనియర్‌తో నమూనా వివాహాన్ని ఘనంగా రెండు రోజుల పాటు జరిపించారు. ఈ పెళ్లి జరిగిన 12 రోజులకే పరిస్థితి విషమించి ఎమ్మా.. జులై 11న మృతి చెందింది. బిడ్డ మరణవార్తతో ఆ తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి