iDreamPost

తప్పతాగి అత్యాచారం చేసేందుకు వచ్చిన వ్యక్తి.. కొట్టి చంపిన మహిళ!

తప్పతాగి అత్యాచారం చేసేందుకు వచ్చిన వ్యక్తి.. కొట్టి చంపిన మహిళ!

దేశవ్యాప్తంగా రోజూ ఏదొక మూల ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మంచంలో ఉన్న పండు ముసలమ్మ నుంచి ఉయ్యాల్లో ఉండే పసిపాప అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా.. న్యాయస్థానాలు ఎంత కఠిన శిక్షలు విధించినా చాలామంది తీరులో మార్పు రావడంలేదు. తప్పు చేస్తే.. శిక్ష పడుతుందని తెలిసినా తప్పు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ సంఘటన చూశాక చాలామందిలో తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి అత్యాచారానికి తెగబడ్డ ఓ మృగాడిని మహిళ కొట్టి చంపింది.

ఈ ఘటన రాజేంద్ర నగర్ పరిధి బద్వేల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బాలయ్య- జయమ్మ దంపతులు బద్వేల్ లో నివాసముంటున్నారు. తెల్లవారుజామున ఫుల్ గా మద్యం తాగి.. శ్రీనివాస్ అనే వ్యక్తి జయమ్మ వాళ్ల ఇంటి తలుపు కొట్టాడు. తలుపులు తీయగా.. ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో శ్రీనివాస్ రెచ్చిపోయాడు. జయమ్మపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. జయమ్మ భయపడి పోకుండా శ్రీనివాస్ పై తిరగబడింది. పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో అతని తలపై కొట్టింది. శ్రీనివాస్ అక్కడే కుప్పుకూలడు. అతనిపై రాడ్డులో జయమ్మ కొడుతూనే ఉంది. ఈ దాడిలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. భర్తతో కలిసి జయమ్మ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి