iDreamPost

‘లియో’ టీంపై సుబ్రమణియం సెన్సేషనల్‌ కామెంట్లు..

అయితే, ఈ కలెక్షన్లపై తమిళనాడు థియేటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిరుముర్‌ సుబ్రమణియం సంచలన కామెంట్లు చేశారు. కలెక్షన్ల విషయంలో లియో టీం మోసాలకు పాల్పడుతోందని అన్నారు.

అయితే, ఈ కలెక్షన్లపై తమిళనాడు థియేటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిరుముర్‌ సుబ్రమణియం సంచలన కామెంట్లు చేశారు. కలెక్షన్ల విషయంలో లియో టీం మోసాలకు పాల్పడుతోందని అన్నారు.

‘లియో’ టీంపై సుబ్రమణియం సెన్సేషనల్‌ కామెంట్లు..

ఇళయ దళపతి విజయ్‌- హిట్టు సినిమాల దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా దూసుకుపోతోంది. లోకేష్‌ యూనివర్శ్‌తో సంబంధం ఉన్న సినిమా కావటంతో.. మొదటి నుంచి ఈ సినిమాపై మంచి హైప్‌ ఉంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో కలెక్షన్ల పంట పండింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ కలెక్షన్లపై తమిళనాడు థియేటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిరుముర్‌ సుబ్రమణియం సంచలన కామెంట్లు చేశారు. కలెక్షన్ల విషయంలో లియో టీం మోసాలకు పాల్పడుతోందని అన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో సుబ్రమణియం మాట్లాడుతూ.. ‘‘లియో బాక్సాఫీస్‌ స్కామ్‌ గురించి నేను మాట్లాడినందుకు సెవెన్‌ స్క్రీన్‌ అధినేత లలిత్‌ కుమారు నన్ను పిలిచి నన్ను దారుణంగా తిట్టాడు. లియో రిలయ్‌ కలెక్షన్లపై ఓ క్లారిటీ లేదు. లలిత్‌ కుమార్‌ ఆయనకు ఇష్టం వచ్చినట్లు నోటి లెక్కలు చెబుతున్నాడు.

లియో టీం తప్పులకు పాల్పడుతోంది. ఓవర్‌సీస్‌లో కలెక్షన్లను చూపించడానికి ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. విజయ్‌ దృష్టిలో పడటానికి లలిత్‌ కుమార్‌ ఇలాంటి స్కాములన్నీ చేస్తున్నాడు’’ అని అన్నారు. మరి, లియో కలెక్షన్లపై తమిళనాడు థియేటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తిరుముర్‌ సుబ్రమణియం సంచలన కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి