Rishab Shetty: రిషబ్ శెట్టి సంస్కారానికి హ్యాట్సాఫ్.. NTR తల్లి కాళ్లకు నమస్కారం!

Jr NTR, Rishab Shetty, Shalini Nandamuri: ‘కాంతార’ చిత్రంతో తెలుగు నాట ఫుల్ పాపులర్ అయిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన యాక్టింగ్, డైరెక్షన్​కు ఇక్కడి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అలాంటోడు మరోమారు తెలుగు వాళ్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

Jr NTR, Rishab Shetty, Shalini Nandamuri: ‘కాంతార’ చిత్రంతో తెలుగు నాట ఫుల్ పాపులర్ అయిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన యాక్టింగ్, డైరెక్షన్​కు ఇక్కడి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అలాంటోడు మరోమారు తెలుగు వాళ్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

సొంత భాష ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ ఒక్క మూవీతోనే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్​ మనసులను దోచుకున్నాడు కన్నడ దర్శకనటుడు రిషబ్ శెట్టి. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్, డైరెక్షన్​కు తెలుగు వాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ‘కాంతార’ ఇక్కడ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ చిత్రంతో తెలుగువారి మనసులు గెలుచుకున్న రిషబ్.. తాజాగా మరో పనితో వాళ్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆయన సంస్కారానికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్​ జూనియర్ ఎన్టీఆర్​ తల్లికి రిషబ్ రెస్పెక్ట్ ఇచ్చిన తీరును అంతా ప్రశంసిస్తున్నారు.

ఎన్టీఆర్ తల్లి షాలిని నందమూరికి ఒక చిరకాల కోరిక ఉండేదట. ఆమె సొంతూరు అయిన కర్ణాటకలోని కుందపురకు తారక్​ను తీసుకెళ్లాలని అనుకునేవారట. అలాగే ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని కొడుకుతో కలసి సందర్శించాలనేది ఆమె డ్రీమ్. అయితే ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నా ఇది నెరవేరలేదట. ఈ తరుణంలో తల్లిని సర్​ప్రైజ్ చేశాడు తారక్. సెప్టెంబర్ 2వ తేదీన ఆమె పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో కలసి కుందపురకు వెళ్లాడు. అమ్మ షాలినీతో పాటు సతీమణి ప్రణతితో కలసి ఉడుపి శ్రీకృష్ణుడ్ని దర్శించుకున్నాడు. ఈ క్రమంలో మంగళూరు ఎయిర్​పోర్ట్​లో దిగిన తారక్ ఫ్యామిలీని రిషబ్ శెట్టి దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తల్లి దగ్గరకు వెళ్లి ఆమె కాళ్లకు నమస్కారం పెట్టాడు.

తారక్​ను హగ్ చేసుకున్నాడు రిషబ్. ఆ తర్వాత వీళ్లు ఉడుపి ఆలయానికి బయల్దేరారు. రిషబ్​తో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అక్కడికి వచ్చారు. ఆలయ సందర్శన సమయంలో ఎన్టీఆర్​తో పాటే ఉండి అన్నీ దగ్గర ఉండి పర్యవేక్షించారు రిషబ్-నీల్. ఒకచోట కలసి భోజనం కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. రిషబ్​ను మెచ్చుకుంటున్నారు. ఆయన సంస్కారానికి ఫిదా అయిపోయామని అంటున్నారు. పెద్దవారితో మెలిగే తీరు, గౌరవం ఎలా ఇవ్వాలి? అనేది రిషబ్​ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ‘కాంతార’ ప్రమోషన్స్ టైమ్​లో ఎన్టీఆర్​కు తాను బిగ్ ఫ్యాన్​నని అన్నాడు రిషబ్. ఆయన యాక్టింగ్ సూపర్బ్​గా ఉంటుందని చెప్పాడు. తారక్​ తల్లిది తనది ఒకే ఊరని.. కుందపురతో తమ ఇద్దరికీ అనుబంధం ఉందన్నాడు. అలాంటిది ఎన్టీఆర్-రిషబ్ కలసి కనిపించడం, ఆలయాన్ని సందర్శించడంతో ఆ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Show comments