Mahesh Babu: ఏపీ, తెలంగాణ వరద బాధితులకు మహేశ్ బాబు రూ. కోటి విరాళం!

Mahesh Babu Donates 1 Crore To AP and TG: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏపీ, తెలంగాణ వరద బాధితులకు అండగా నిలిచాడు. ఏకంగా కోటి రూపాయల భూరి విరాళం ప్రకటించాడు.

Mahesh Babu Donates 1 Crore To AP and TG: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏపీ, తెలంగాణ వరద బాధితులకు అండగా నిలిచాడు. ఏకంగా కోటి రూపాయల భూరి విరాళం ప్రకటించాడు.

ఏపీ, తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎటు చూసిన వరదనీరే. ఆహారం కోసం, నీళ్ల కోసం జనాలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు మేమున్నాం అంటూ చేయూతను అందించడానికి ముందుకు వచ్చింది తెలుగు సినిమా పరిశ్రమ. భారీ విరాళాలు ప్రకటిస్తూ సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా మహేశ్ బాబు సైతం భూరి విరాళం ప్రకటించాడు.

టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ, తెలంగాణలోని వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. వరుసగా భారీ విరాళాలు ప్రకటిస్తూ.. తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం వరద బాధితులకు అండగా నిలిచాడు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. సీఎం రిలీఫ్ పండ్ కు ఈ నిధులు ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు మహేశ్. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం చేపడుతున్న రక్షణ చర్యలకు ప్రతిఒక్కరు సహాయం చేయాలని, ఈ సంక్షోభాన్ని అధిగమించి భవిష్యత్ లో మరింత బలంగా పుంజుకోవాలని మహేశ్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్, బాలయ్య, విశ్వక్ సేన్, వైజయంతి మూవీస్, సిద్దు జొన్నలగడ్డ, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు లతో పాటుగా మరికొందరు తమ సాయాన్ని ప్రకటించారు. మరి గొప్ప మనసును చాటుకుంటూ వరద బాధితులకు కోటి రూపాయాలు సాయం చేసిన మహేశ్ బాబుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments