iDreamPost

కొత్త కలయికతో అరవ హీరో

కొత్త కలయికతో  అరవ హీరో

చూస్తుంటే తమిళ హీరోల టాలీవుడ్ స్కెచ్ గట్టిగానే ఉండబోతోంది. అక్కడ తగినన్ని ఆఫర్లు ఉన్నప్పటికీ తెలుగు దర్శకులు నిర్మాతలు మంచి కథలు చెబుతుండటంతో పాటు రెమ్యునరేషన్లు బడ్జెట్ లు గట్రా టెంప్ట్ చేసేలా సెట్ చేయడంతో నో అనేందుకు కారణం దొరకడం లేదు. ఇప్పటికే విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉండగా ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోని ఆల్రెడీ చెప్పేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ కర్ణన్ హీరో మరో ప్రాజెక్ట్ కూడా ఒప్పుకున్నారట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. కాకపోతే టైం చాలా పడుతుంది.

ఇందులో మరికొన్ని విశేషాలు ఉన్నాయి. హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న పూజాని లాక్ చేయడం అంటే బడ్జెట్ పరంగా పాన్ ఇండియా లెవెల్ కు వెళ్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ పాయింట్ తో దీన్ని రూపొందించబోతున్నారని వినికిడి. ఇప్పటిదాకా కేవలం ప్రేమ కథలను మాత్రమే డీల్ చేసిన వెంకీ అట్లూరికి చివరి రెండు సినిమాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అందుకే ఈసారి పూర్తిగా జానర్ ని మార్చి భారీ స్కెచ్ ని సిద్ధం చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.

కానీ ధనుష్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకునేసరికి ఎంతలేదన్నా ఏడాదిన్నర పైగానే పడుతుంది. శేఖర్ కమ్ములది పూర్తి చేశాకే ఇది సెట్స్ పైకి వెళ్ళాలి. మన నిర్మాతలు ఈ మధ్య తమిళ మార్కెట్ మీద కన్నేస్తున్నారు. సరైన హిట్ పడితే రెండు భాషల్లోనూ బిజినెస్ పరంగా బాగా వర్కౌట్ చేసుకునే ఛాన్స్ ఉండటంతో ఇలా కానిచ్చేస్తున్నారు. ధనుష్ సరసన పూజా హెగ్డే నటించడం నిజమైతే ఇది ఫస్ట్ టైం కాంబో అవుతుంది. త్రివిక్రమ్ పర్యవేక్షణలో నడుస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్ మెల్లగా పక్కభాషల సినిమాల మీద కూడా ఫోకస్ ని పెంచబోతోంది.

Also Read : క్రేజీ సినిమాలకు ఇదో పెద్ద తలనెప్పి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి