టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్లో అతడి రాకపై లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్లో అతడి రాకపై లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రిషబ్ పంత్.. భారత క్రికెట్పై అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసిన ప్లేయర్. కీపర్గా, బ్యాట్స్మన్గా తన ఆటతీరుతో ఎంతో మంది మనసులను దోచుకున్నాడు పంత్. షార్ట్ టైమ్లోనే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. టీ20లు, వన్డేల కంటే కూడా టెస్టుల్లో అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో బౌలర్ ఎవరు? పిచ్ ఎలా ఉంది? లాంటివి పట్టించుకోడు పంత్. వచ్చిన బాల్ను వచ్చినట్లు బౌండరీకి తరలించేందుకు ఇష్టపడతాడు. టెస్టుల్లో అటాకింగ్ బ్యాటింగ్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు రిషబ్. ఇంగ్లండ్ గడ్డ మీద కూడా కొన్ని మర్చిపోలేని ఇన్నింగ్స్లు ఆడాడు.
విదేశీ పిచ్లపై ఆడేందుకు ఆసియా ప్లేయర్లు భయపడతారు. కానీ పంత్ మాత్రం ఫారెన్ కంట్రీస్లో బాగా బ్యాటింగ్ చేస్తాడు. బౌన్సీ, పేస్ ట్రాక్ల మీద ఎక్కువ రన్స్ చేస్తాడు. అలాంటి కీలక ప్లేయర్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ఏడాది కింద పంత్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తున్న క్రమంలో అతడి కారు డివైడర్ను ఢీకొట్టి మంటల్లో కాలిబూడిదైంది. ఆ టైమ్లో కారులో పంత్ ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతడు నిద్రమత్తులో జారుకోవడంతోనే ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాటర్ టీమ్కు దూరమయ్యాడు. మెళ్లిగా కోలుకున్న పంత్.. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్లో ఉన్న పంత్ అక్కడ తన ఫిట్నెస్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మునుపటి ఫామ్ను అందుకోవడంతో పాటు బ్యాటింగ్, కీపింగ్ టెక్నిక్స్ను బెటర్ చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పంత్ రీఎంట్రీ ఎప్పుడనే దానిపై క్లారిటీ లేదు. దీని మీద భారత లెజెండరీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ స్పష్టత ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దాదా గుడ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఐపీఎల్లో పంత్ తప్పక ఆడతాడని అన్నాడు. ‘పంత్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో అతను ఆడతాడు. ఐపీఎల్ వేలం గురించి రిషబ్తో డిస్కస్ చేశాం. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా పంత్ ఉండాలని అందరమూ భావిస్తున్నాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. మరి.. ఐపీఎల్లో పంత్ రీఎంట్రీ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నవీన్ ఉల్ హక్.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం?
Ganguly confirms Rishabh Pant will get better by January. [Sportstar]
– Good news for India. pic.twitter.com/mCyeNHPWHT
— Johns. (@CricCrazyJohns) November 10, 2023