iDreamPost

దారుణం: మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన గ్రామస్తులు!

దారుణం: మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన గ్రామస్తులు!

దేశంలో కొందరు కామంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆరేళ్ల బాలికల నుంచి 60 ఏళ్ల ముసలవ్వల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అయితే అచ్చం ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో మరొకటి చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ బిల్వారా జిల్లాలోని ఓ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన దుర్మార్గులు ఆ బాలికపై కన్నేశారు. ఎలాగైనా ఆ అమ్మాయిపై లైంగిక కోరిక తీర్చుకోవాలని భావించారు. ఇక అనుకున్నట్లుగానే కొందరు యువకులు ఆ బాలికను బలవంతంగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలికను దారుణంగా హత్య చేసి ఓ చోట కాల్చారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఈ ఘోరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: భర్తను చంపి బెయిల్‌ మీద బయటకు వచ్చింది.. చివరకు చెరువుగట్టు మీద

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి