iDreamPost

ఆ సంఘటన స్ఫూర్తితో రాధే శ్యామ్ ?

ఆ సంఘటన స్ఫూర్తితో రాధే శ్యామ్ ?

ఈ ఏడాది రావాల్సిన పాన్ ఇండియా సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న రాధే శ్యామ్ ఇంకొక్క పాట కొంత ప్యాచ్ వర్క్ మినహాయిస్తే మొత్తం షూట్ ని పూర్తి చేసుకుంది. బ్యాలన్స్ కూడా ఈ నెలలోనే అయిపోతుంది. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ ని యువి సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.పెదనాన్న కృష్ణంరాజు నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు ఇందులో ఒక కీలకమైన ఓ క్యామియో చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది. ఈలోగా మరో కిక్ ఇచ్చే న్యూస్ చక్కర్లు కొడుతోంది.

రాధే శ్యామ్ కథకు సంబంధించిన ఓ అప్ డేట్ బాగా ఆసక్తి రేపెలా ఉంది. ఇది నిజమో కాదో కానీ వినగానే మాత్రం టీజర్ తో సింక్ అవుతూ ఇప్పటిదాకా విన్న లీక్స్ ని కనెక్ట్ చేస్తూ వాస్తవం అనిపించేలా ఉంది. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా 1911 ఇటలీలో జరిగిన ఓ ట్రైన్ యాక్సిడెంట్ ని ఆధారంగా చేసుకుని రాసుకున్నారట. ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక టన్నెల్ లోకి ప్రవేశించిన ట్రైన్ ఆశ్చర్యకరంగా మాయమై పోతుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరూ వర్తమానంలోకి వస్తారు. ఈ రెండు కాలాల మధ్య ఏం జరిగింది వీళ్ళిద్దరూ చివరికి ఎక్కడ చేరుకున్నారు అనేదే అసలు కథ అని వినికిడి.

ప్రభాస్ చేయి చూసి జాతకం చెప్పేవాడిగా, పూజా హెగ్డే స్కూల్ టీచర్ గా నటిస్తోందని కూడా అంటున్నారు. కాకపోతే మరీ వెనక్కు వెళ్తే ఇప్పటి ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం కష్టమని సంఘటన జరిగిన కాలాన్ని 1970లకు మార్చినట్టు తెలిసింది. సినిమా రిలీజయ్యాక ఇదే ఉండొచ్చు లేదా పూర్తిగా వేరుగా ఉండొచ్చు కానీ మొత్తానికి రాధే శ్యామ్ లో ఊహించని మలుపులు ట్విస్టులు ఉన్నాయనే క్లారిటీ వస్తోంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించి నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా థర్డ్ వేవ్ తో సహా అన్ని పూర్తిగా సద్దుమణిగాకే అప్పుడు ప్రకటన ఇవ్వబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి