iDreamPost

9 ప్రాజెక్టులు.. రూ.15,233 కోట్లు..

9 ప్రాజెక్టులు.. రూ.15,233 కోట్లు..

విశాఖలో ప్రధాని చేతుల మీదుగా 7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన ,7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను జాతికి అంకితం..

శంకుస్థాపనల ప్రాజెక్టులు..
రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

►రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ.
►రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్‌–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఎకనామిక్‌ కారిడార్‌.
►రూ.566 కోట్లతో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు.
►రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి.
►రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.

జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు..

రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

►రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం–నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి.
►రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్‌.
►రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్‌ గ్రాస్‌ రూట్ పీవోఎల్‌ డిపో నిర్మాణం.
► రూ.4,106 కోట్లతో విజయవాడ–గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి