iDreamPost

Video: మొబైల్ మత్తులో పడి తల్లి నిర్వాకం! బిడ్డ ప్రాణాలు పోతున్నా!

  • Published Apr 01, 2024 | 6:10 PMUpdated Apr 01, 2024 | 6:10 PM

ప్రస్తుత కాలంలో మొబైల్ అడిక్షన్ అనేది ఎంత ప్రమాదకరమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. ఈ ఫోన్ పరధ్యానంలో పడిపోయి పిల్లలను కూడా పట్టించుకోకపోవడంతో పెను ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అందుకు అద్దం పట్టేలా ఓ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుత కాలంలో మొబైల్ అడిక్షన్ అనేది ఎంత ప్రమాదకరమనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. ఈ ఫోన్ పరధ్యానంలో పడిపోయి పిల్లలను కూడా పట్టించుకోకపోవడంతో పెను ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అందుకు అద్దం పట్టేలా ఓ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Apr 01, 2024 | 6:10 PMUpdated Apr 01, 2024 | 6:10 PM
Video: మొబైల్ మత్తులో పడి తల్లి నిర్వాకం! బిడ్డ ప్రాణాలు పోతున్నా!

ఈ మధ్య చాలామంది యువత పూర్తిగా స్మార్ట్ ఫోన్ లకు బానిసలు అయిపోతూ లోకం మార్చిపోతున్నారు. దీంతో ఒక్క క్షణం ఫోన్ లేకపోయినా వారికి టైమ్ గడవదు. అయితే ఒకప్పుడు ఈ ఫోన్ అనేది అవసరంలా అనిపించేది, కానీ ఇప్పుడు ప్రతిఒక్కరికి నిత్యావసరంలా మారిపోయింది. ముఖ్యంగా.. ఇటీవల కాలంలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ రీల్స్ పిచ్చిలో పడిపోయి ఫోన్ కు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒంటి మీద సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉండటం వలనే కొన్ని సార్లు ప్రాణాలు పోయే ఘటనలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా చంటి బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఈ ఫోన్ పరధ్యానంలో పడి రెప్పపాటు నిర్లక్ష్యం చేసిన పెను ప్రమాదాలు చోటు చేసుకునే ఘటనలు చాలనే ఉన్నాయి. తాజాగా ఇలా ఫోన్ పరాధ్యానంలో పడి ఓ తల్లి తన బాబు విషయంలో చేసిన పని తెలిస్తే షాక్ అయిపోతారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తాజాగా జరిగిన ఓ ఘటనలో ఓ ఇంట్లోని హాల్లో తల్లి, చిన్న బాబు ఉంటారు. అయితే ఆ పిల్లవాడు హాల్‌లో కొన్ని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. పక్కన ఉన్న ఆ తల్లి వంట కోసం కూరగాయలు తరుముతూ పనులు చేస్తూ ఉంటుంది. కానీ, ఇంతలోనే ఆ తల్లికి ఫోన్ వస్తుంది. ఇక ఆ ఫోన్ మాట్లాడుతూ.. వంట కోసం సరిపోయినా కూరగాయాలను తరిమి మిగిలిన వాటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలనుకుంటుంది. ఇక ఫోన్ మాట్లాడుతున్న పరాధ్యానంలో ఉన్న ఆ మహిళ.. ఫ్రిడ్జ్‌లో కూరగాయలకు బదులు, పిల్లవాడిని కూర్చోబెట్టి డోర్ వేస్తుంది. ఇక అక్కడకి కొంత సేపు తర్వాత.. ఆమె భర్త లోపల రూమ్ నుంచి హాల్ లోకి వస్తాడు. ఇక బాబు కనిపించకపోయే సరికి ఎక్కడ అని అడుగుతాడు. అలా ఇద్దరూ ఇల్లంతా వెతికినా ఆ బాబు కనిపించడు. అంతలోనే.. ఆ పిల్లాడి ఏడుపు మెల్లగా వినిపిస్తుంటుంది. ఇక ఆ ఏడుపును గమనించిన తండ్రి ఎక్కడి నుంచి వస్తుందా అని కనిపెట్టి.. ఫ్రిడ్జ్ డోర్ తెరిచి చూడగా.. అందులో పిల్లాడు కనిపిస్తాడు. దీంతో ఒక్కసారిగా షాక్ గురయిన ఆ భర్త బాబును తీసుకొని.. ఫోన్ మైకంలో లోకం మార్చిపోయి తన భార్య చేసిన ఘనకార్యనికి చివాట్లు వేస్తాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మొబైల్ మాయలో పడిపోయిన తల్లి.. పిల్లాడి పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది అన్నది కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇది నిజమైన వీడియో కాదు. ప్రస్తుత కాలంలో ఫోన్ అడిక్షన్ ఎంత ప్రమాదకరమో జనల్లో అవగాహన కోసం చేసిన ఓ చిన్న ప్రయత్నం పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది చూపించి.. జనాల్లో అవగాహన కోసం చేసిన ఓ ప్రయత్నం. కనుక చంటి బిడ్డలు ఉన్న తల్లులూ ఈ వీడియో చూసి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రస్తుతం కాలంలో ఫోన్ అడిక్షన్ ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి