iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ వల్ల ఇప్పటికే మూడేళ్ళ కాలాన్ని త్యాగం చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దర్శనమిచ్చేందుకు ఇంకా టైం పట్టేలా ఉంది. పోనీ బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడులో అయినా చూద్దామనుకుంటే అది కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల కొంత ఆలస్యమవుతూ వస్తోంది. వీటి సంగతలా ఉంచితే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే తన 30వ సినిమా మీద జూనియర్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎలాగూ ఆచార్యకు మళ్ళీ బ్రేక్ దొరికింది కాబట్టి దర్శకుడితో కలిసి రెగ్యులర్ గా వీడియో కాల్స్ రూపంలో స్క్రిప్ట్ కు సంబంధించిన డిస్కషన్స్ క్రమం తప్పకుండ చేస్తున్నారట. ఫైనల్ వెర్షన్ ఇంకా లాక్ చేయలేదు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెబుతున్నారు. స్టూడెంట్ లీడర్ నుంచి యంగ్ పొలిటీషియన్ స్థాయికి ఎదిగిన కథానాయకుడిగా తారక్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి. గతంలో రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో 2003లో నాగ సినిమాను జూనియర్ చేశాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తన వయసుకు మించిన బరువైన పాత్రను డిజైన్ చేయడంతో పాటు కథనంలోని లోపాల వల్ల జనానికి కనెక్ట్ కాలేదు. అందులోనూ నాగ దర్శకుడి అనుభవలేమి కూడా ఫలితం మీద ప్రభావం చూపించింది. కానీ కొరటాల విషయంలో ఆ భయం అక్కర్లేదు
కరోనా సెకండ్ వేవ్ తారక్ అనే కాదు అందరి ప్లానింగ్స్ తలకిందులయ్యాయి. షూటింగులు విడుదలలు అన్నీ గందరగోళమే. జనవరి నుంచి జరుగుతున్న పరిణామాలు చూసి అంతా సర్దుకుంది లెమ్మని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం ఊహించని షాక్. అందుకే ఏ నిర్మాత కాన్ఫిడెంట్ తమ సినిమాల అప్డేట్స్ గురించి చెప్పలేకపోతున్నారు. ఇంకో రెండు మూడు నెలలు నిశ్చింతగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావడానికి టైం పట్టేలా ఉంది. జరుగుతున్నది చూస్తూ ఉండటం తప్ప ఎవరైనా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.