iDreamPost

Kane Williamson: విలియమ్సన్ అరుదైన ఘనత.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!

  • Published Feb 04, 2024 | 3:12 PMUpdated Feb 04, 2024 | 3:12 PM

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా టీమిండియా బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా టీమిండియా బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

  • Published Feb 04, 2024 | 3:12 PMUpdated Feb 04, 2024 | 3:12 PM
Kane Williamson: విలియమ్సన్ అరుదైన ఘనత.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!

క్రికెట్​లో ప్రస్తుత తరం ఆటగాళ్లలో బెస్ట్ ఎవరంటే అందరూ విరాట్ కోహ్లీ పేరే చెబుతారు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ రూపంలో కోహ్లీకి గట్టిపోటీ ఉంది. కానీ కోహ్లీ మాత్రం భీకరమైన ఫామ్​లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తూ.. అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే టెక్నికల్​గా బెస్ట్ బ్యాట్స్​మన్ అనే పేరు తెచ్చుకున్నాడు విలియమ్సన్. మ్యాచ్​లో కేన్ మామ ఆడుతున్నాడంటే చాలు.. అపోజిషన్ టీమ్స్ వణికిపోతాయి. అతనేమీ భారీ సిక్సులు, బౌండరీలతో విరుచుకుపడకపోయినా.. చాప కింద నీరులా చూస్తుండగానే ప్రత్యర్థి చేతి నుంచి మ్యాచ్​ను లాగేసుకుంటాడు. గాయాలతో సతమతం అవుతున్నా గ్రౌండ్​లోకి దిగిన ప్రతిసారి సూపర్బ్ నాక్స్​తో అదరగొడుతున్నాడు. తాజాగా కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు విలియమ్సన్.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ స్టార్ బ్యాటర్ విలియమ్సన్ చెలరేగిపోయాడు. అద్భుతమైన శతకంతో తన జట్టు భారీ స్కోరు సాధించడంలో గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్​లో ఫస్ట్ డౌన్​లో బ్యాటింగ్​కు దిగిన కేన్ మామ 259 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు. ఇది అతడికి టెస్టుల్లో 30వ సెంచరీ కావడం విశేషం. ఈ జనరేషన్ క్రికెటర్స్​లో 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత 30 సెంచరీలతో విలియమ్సన్, జో రూట్ రెండో ప్లేసులో కొనసాగుతున్నారు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 29 శతకాలతో మూడో ప్లేసులో ఉన్నాడు. ఇంతకుముందు వరకు కోహ్లీతో సమానంగా ఉన్న కేన్ మామ.. తాజా శతకంతో 30 సెంచరీల క్లబ్​లో జాయిన్ అయ్యాడు. అయితే ఓవరాల్ సెంచరీస్ జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం.

మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 80 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ (46), జో రూట్ (46), స్టీవ్ స్మిత్ (44), విలియమ్సన్ (43) కొనసాగుతున్నారు. ఇక, సౌతాఫ్రికాతో మ్యాచ్​లో విలియమ్సన్​తో పాటు రచిన్ రవీంద్ర (211 బంతుల్లో 118) కూడా సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే టైమ్​కు కివీస్ 86 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో మోర్కీ, పాటెర్సన్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ మొదట్లో డెవాన్ కాన్వే (1), టామ్ లాథమ్ (20) త్వరగా ఔటవడంతో కివీస్ డిఫెన్స్​లో పడింది. ఈ సిచ్యువేషన్​లో రచిన్, కేన్ మామ టీమ్​ను ఆదుకున్నారు. ఇద్దరూ కలసి మూడో వికెట్​కు ఏకంగా 221 పరుగులు జోడించారు. మరి.. విరాట్ రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి