iDreamPost

MS Dhoni: ధోని ఆటగాళ్లను యూజ్ చేసుకుంటాడు! టీమిండియా క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

  • Published Jan 10, 2024 | 10:43 AMUpdated Jan 10, 2024 | 10:43 AM

లెజెండ్​ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ఆటగాళ్లను యూజ్ చేసుకుంటాడని అన్నాడు.

లెజెండ్​ మహేంద్ర సింగ్ ధోనీపై ఓ టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ఆటగాళ్లను యూజ్ చేసుకుంటాడని అన్నాడు.

  • Published Jan 10, 2024 | 10:43 AMUpdated Jan 10, 2024 | 10:43 AM
MS Dhoni: ధోని ఆటగాళ్లను యూజ్ చేసుకుంటాడు! టీమిండియా క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

క్రికెట్​లో ఎందరో కెప్టెన్లను చూసుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే గ్రేటెస్ట్ స్కిప్పర్స్​గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ఒకడు. వికెట్ కీపర్, బ్యాటర్​గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోని తనకు వచ్చిన ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్​లతో అందర్నీ షాక్​కు గురిచేశాడు. అతడి హిట్టింగ్ చూసి ఇదేం బాదుడ్రా అని అందరూ అనుకున్నారు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ తొలుత టీ20 టీమ్ పగ్గాలను ఇచ్చింది. ఆ తర్వాత వన్డే, టెస్టు సారథ్య బాధ్యతల్నీ అతడికే అప్పగించింది. నమ్మకాన్ని నిలబెట్టుకున్న ధోని.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్​ను భారత్​కు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్​ చేశాడు. తద్వారా గ్రేటెస్ట్ కెప్టెన్​గా అవతరించాడు. అలాంటి ధోని మీద టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాహీ ప్లేయర్లను వాడుకుంటాడని అన్నాడు.

భారత జట్టుకు వన్డేల్లో వరల్డ్ కప్​తో పాటు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు ధోని. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను ఐదుసార్లు విజేతగా నిలబెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, మహ్మద్ షమి లాంటి ఎందరో స్టార్లు అతడి సారథ్యంలోనే ఎదిగారు. వాళ్లందరికీ మాహీ అండగా నిలబడ్డాడు. అలాంటి ధోనీపై మాజీ క్రికెటర్ ప్రవీణ్​ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు ఆటగాళ్లను యూజ్ చేసుకుంటాడని అన్నాడు. అయితే పాజిటివ్ యాంగిల్​లోనే ఈ కామెంట్స్ చేశాడు. తాను చూసిన వారిలో బెస్ట్ కెప్టెన్ ధోని అన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించిన వారిలో మాహీ అందరికంటే బెస్ట్ అన్నాడు. ఏ ప్లేయర్​ను ఎలా వాడుకోవాలి, ఎప్పుడు అతడ్ని బరిలోకి దింపాలనేది ధోనీకి బాగా తెలుసన్నాడు. ఫీల్డ్​ను కూడా అతడే సెట్ చేసేవాడని ప్రవీణ్​ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

praveen kumar comments on ms dhoni

‘కెప్టెన్లలో ధోనీనే బెస్ట్. ఒక ప్లేయర్​ను ఎలా యూజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. ఆటగాళ్లను ఎప్పుడు ఆడించాలి, ఎలా వినియోగించుకోవాలో అతడికి బాగా తెలుసు. మేం బౌలింగ్ చేసేటప్పుడు అతడే ఫీల్డింగ్ సెట్ చేసేవాడు. మా బౌలింగ్​కు తగ్గట్లు కొన్ని ఛేంజెస్ చెప్పేవాళ్లం. దానికి అతడు ఓకే చెప్పేవాడు’ అని ప్రవీణ్​ కుమార్ వ్యాఖ్యానించాడు. ధోని గురించి ప్రవీణ్​ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాహీనే బెస్ట్ కెప్టెన్ అని అతడి ఫ్యాన్స్ చెబుతున్నారు. కెప్టెన్సీ అంటే ఏంటో ధోనీని చూసి అందరూ నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్​ కుమార్ మరికొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ తనను బెదిరించాడని తెలిపాడు. ఆర్సీబీలో చేరాల్సిందిగా తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని పేర్కొన్నాడు. మరి.. ధోనీనే బెస్ట్ కెప్టెన్ అంటూ ప్రవీణ్​ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న రోహిత్.. అతడి సొంత తమ్ముడు మాత్రం..!

 

View this post on Instagram

 

A post shared by yr samar (@yrtweet2)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి