iDreamPost

మహేష్ బాబు సినిమాకు ‘అ’ సెంటిమెంట్

మహేష్ బాబు సినిమాకు ‘అ’ సెంటిమెంట్

సర్కారు వారి పాట సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టలేదు. కొంత బ్రేక్ తీసుకుని వచ్చే నెల లేదా జూలై నుంచి స్టార్ట్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ ఒకటి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ త్రివిక్రమ్ దీనికి ‘అర్జునుడు’ టైటిల్ ని లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట. కాకపోతే ప్రిన్స్ ఆల్రెడీ అర్జున్ చేశాడు. పెద్దగా ఆడలేదు కూడా. స్వంత బ్యానర్ లో అన్నయ్య రమేష్ బాబు నిర్మాతగా కోట్ల రూపాయల బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యావరేజయ్యింది

అలాంటప్పుడు అర్జునుడుకి ఓటేస్తారానే డౌట్ ఫాన్స్ లో లేకపోలేదు. అలా కాకుండా అతడు కోణంలో చూసుకుంటే ఇద్దరికీ అచ్చివచ్చిన అక్షరాలుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. అల వైకుంఠపురములో తరహాలో ఇది కూడా ఫ్యామిలీ కం మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. అతడు, ఖలేజాలో హీరోయిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్ ఇందులో మాత్రం తనదైన వినోదాన్ని రంగరించి యాక్షన్ టచ్ ఇస్తారని తెలిసింది. గతంలో పార్థు అనే టైటిల్ ప్రచారం జరిగింది కానీ అదంత కిక్ ఇచ్చేలా లేదని యూనిట్ తో సహా మహేష్ కూడా అభిప్రాయపడటంతో అర్జునుడు వైపు మొగ్గు చూపారట.

హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా కీలకమైన మరో పాత్రకు శ్రీలీలను తీసుకోబోతున్నట్టు వార్త వచ్చింది కానీ దాని తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. తన ప్రతి మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసే త్రివిక్రమ్ ఈషా రెబ్బ, అనుపమ పరమేశ్వరన్, నివేత పేతురాజ్ లను ఈ తరహాలోనే చూపించాడు. కానీ సినిమాలు హిట్టయ్యాయి కానీ వీళ్లకు పెద్దగా ఒరిగింది లేదు. మరి శ్రీలీల ఏం చేస్తుందో చూడాలి. తమన్ మ్యూజిక్ కంపొజిషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పుడు మొదలుపెట్టినా 2023 సంక్రాంతికి విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ ఆల్రెడీ తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఆ సీజన్ కు రావడం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి