iDreamPost

IND vs PAK:వేరే జెర్సీ ధరించి బరిలోకి దిగిన కోహ్లీ

IND vs PAK:వేరే జెర్సీ ధరించి బరిలోకి దిగిన కోహ్లీ

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ కి లక్షమందికి పైగా అభిమానులు హాజరవ్వగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు లీగ్ మ్యాచ్ లు ఆడిన భారత్ రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. ఇవాళ దాయాదులతో జరుగుతోన్న మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసి మూడో విజయాన్ని అందుకోవాలని దృఢసంకల్పంతో బరిలోకి దిగింది భారత్. కాగా రసవత్తరమైన ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ భారీ తప్పిదం చేశాడు. ఏకంగా వేరే జెర్సీ ధరించి బరిలోకి దిగాడు.

ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడి డగౌట్ కి వెళ్లాడు. దీంతో అందరు షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఫీల్డింగ్ చేసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టిన కోహ్లీ ట్రై కలర్ జెర్సీ కాకుండా వేరే జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.

భారత క్రికెట్ ప్లేయర్స్ అందరు అందరు ధరించిన జెర్సీలపై ట్రై కలర్ స్ట్రిప్స్ ఉండగా, కోహ్లీ ధరించిన జెర్సీపై మూడు వైట్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. దీన్ని గమనించిన కింగ్ కోహ్లీ వెంటనే మైదానాన్ని వీడాడు. వెంటనే డగౌట్ కి వెళ్లి ట్రై కలర్ జెర్సీని ధరించి మళ్లీ ఫీల్డింగ్ లో పాల్గొన్నాడు. కోహ్లీ గ్రౌండ్ లో అడుగుపెడుతున్న సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ 33 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు సిరాజ్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, హార్థిక్ పాండ్య ఒక వికెట్ పడగొట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి