Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. వైరస్ బారినపడే ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధికి కరోనా సోకింది. వైసీపీ నేత, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వైరస్ బారిన పడ్డారు. నలతగా ఉండడంతో ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం నాగేశ్వరరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా ఆయనను కలిసి అధికారులు, పార్టీ నేతలు పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఏపీలో కరోనా పాజిటివ్ రేటు భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు 2,000 – 2,500 మధ్య నమోదువుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రోజుకు పది వేల చొప్పన నమోదయ్యాయి. క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం మూడు వేల దిగువకు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.