iDreamPost

IPL 2022 : నా ఆట గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోను

IPL 2022 : నా ఆట గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోను

IPL 2022లో సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కి మ్యాచ్ జరగగా ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లకు గాను 165 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలోనే 113 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

గత కొంతకాలంగా బుమ్రా ప్రదర్శన అస్సలు బాగోలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో నిన్నటి ఆటలో చెలరేగి బుమ్రా ఒకేసారి అయిదు వికెట్లు తీయడంతో ఇండియన్ పేస్‌ బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా మాట్లాడుతూ.. టోర్నమెంట్‌కు నేను పూర్తిస్థాయిలోనే సిద్దమయ్యాను. కానీ ఫలితం మన చేతిలో ఉండదు. ఆడే విధానంపై అవగాహన ఉంటే ముందుకు వెళ్లిపోవచ్చు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగినట్లు బౌలింగ్‌ చేయాలి. నా ప్రదర్శన పట్ల నేనైతే సంతోషంగానే ఉన్నాను. మనం ఆడకపోతే బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ నా ఆట గురించి, నా గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని ఆలోచిస్తూ నా ఆటని నేను జడ్జ్ చేసుకోను. అలాంటి వాళ్ళు ఎన్ని అన్నా నేను పట్టించుకోను అంటూ తనపై వస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి