iDreamPost

IND vs ENG: భారత్​తో రెండో టెస్ట్.. షాకిచ్చిన ఇంగ్లండ్.. తుదిజట్టులోకి 20 ఏళ్ల కుర్రాడు!

  • Published Feb 01, 2024 | 3:05 PMUpdated Feb 01, 2024 | 3:08 PM

వైజాగ్​ ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో భారత్​తో తలపడబోయే తుదిజట్టును ప్రకటించింది ఇంగ్లండ్. అయితే ఫైనల్ ఎలెవన్​లో అనూహ్యంగా ఓ 20 ఏళ్ల కుర్రాడికి చోటు కల్పించింది.

వైజాగ్​ ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో భారత్​తో తలపడబోయే తుదిజట్టును ప్రకటించింది ఇంగ్లండ్. అయితే ఫైనల్ ఎలెవన్​లో అనూహ్యంగా ఓ 20 ఏళ్ల కుర్రాడికి చోటు కల్పించింది.

  • Published Feb 01, 2024 | 3:05 PMUpdated Feb 01, 2024 | 3:08 PM
IND vs ENG: భారత్​తో రెండో టెస్ట్.. షాకిచ్చిన ఇంగ్లండ్.. తుదిజట్టులోకి 20 ఏళ్ల కుర్రాడు!

భారత్​తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్​లోనే బోణీ కొట్టడంతో ఇంగ్లండ్ ఫుల్ జోష్​లో ఉంది. బజ్​బాల్ ఫార్ములా ఇండియాలో వర్కౌట్ కాదంటూ ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా ఆడి మొదటి టెస్టులో విజయం సాధించింది ఇంగ్లీష్​ టీమ్. ఉప్పల్ టెస్టులో 28 పరుగులతో నెగ్గిన స్టోక్స్ సేన.. సిరీస్​ను కైవసం చేసుకుంటామనే ధీమాలో కనిపిస్తోంది. అదే జోష్​తో వైజాగ్​లో జరగనున్న రెండో టెస్టు​కు సిద్ధమవుతోంది. శుక్రవారం నాడు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్​లో పర్యాటక జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడేందుకు వెనుకాడబోమని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పిన నేపథ్యంలో నిజంగానే అంత సాహసం చేస్తారా? అని అంతా అనుకున్నారు. కానీ ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్​కే కట్టుబడింది. తాజాగా తమ ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించిన ఇంగ్లండ్.. అనూహ్యంగా 20 ఏళ్ల కుర్రాడికి తుదిజట్టులో చోటు కల్పించింది.

భారత్​తో సిరీస్​లో ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఇంగ్లండ్.. రెండో టెస్టుకూ దాన్ని కంటిన్యూ చేసింది. శుక్రవారం నుంచి వైజాగ్ టెస్టు ప్రారంభం కానుండగా.. ఒక రోజు ముందుగానే తుదిజట్టును ప్రకటించింది. ఫైనల్ ఎలెవన్​లో రెండు కీలక మార్పులు చేసింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ జాక్​ లీచ్​ ఈ మ్యాచ్​కు దూరమవడంతో అతడి స్థానంలో 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్​ను టీమ్​లోకి తీసుకుంది. అలాగే మొదటి టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన స్టార్ ఆల్​రౌండర్ మార్క్ వుడ్ స్థానంలో లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్​కు అవకాశం ఇచ్చింది. ఓపెనింగ్ బాధ్యతల్ని జాక్ క్రాలేతో కలసి బెన్ డకెట్ పంచుకోనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్​లో గత మ్యాచ్ హీరో, వైస్ కెప్టెన్ ఓలీ పాప్ రానున్నాడు. సెకండ్ డౌన్​లో స్టార్ బ్యాటర్ జో రూట్ ఆడతాడు.

మిడిలార్డర్ భారాన్ని జానీ బెయిర్​స్టో, బెన్ ఫోక్స్​తో కలసి కెప్టెన్ బెన్ స్టోక్స్ షేర్ చేసుకుంటాడు. స్పిన్నర్లుగా రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్​లీ ఉండనే ఉన్నారు. అదనపు స్పిన్నర్​గా​ బషీర్ జాయిన్ అయ్యాడు. రూట్ కూడా స్పిన్​ బౌలింగ్​తో మ్యాజిక్ చేస్తాడు కాబట్టి ఇంగ్లండ్ బౌలింగ్​లో బలంగా కనిపిస్తోంది. వైజాగ్ టెస్ట్​లో అపోజిషన్ టీమ్ నుంచి స్పెషలిస్ట్ పేసర్​గా అండర్సన్ ఒక్కడే ఆడతాడు. అతడితో పాటు సారథి స్టోక్స్ కూడా పేస్ బౌలింగ్ వేయగలడు. దీంతో అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ ఇంగ్లీష్ టీమ్ స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. ఈ మ్యాచ్​తో బషీర్ ఇంటర్నేషనల్ క్రికెట్​లో అరంగేట్రం చేయనున్నాడు. దీంతో వైజాగ్ టెస్టు అతడికి ఎప్పటికీ గుర్తుండిపోనుంది. మరి.. ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్​ ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి