iDreamPost

మరో పరువు దాడి.. అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి..

మరో పరువు దాడి.. అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి..

ఇటీవల పరువు హత్యలు ఎక్కువ అయ్యాయి. తమ ఇంటి అమ్మాయిలు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారనో, వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకున్నారనో ఆ అబ్బాయిని చంపడానికి కూడా వెనకాడట్లేదు. గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు చాలానే వస్తున్నాయి. ఒకటి మర్చిపోదామనుకునే లోపే మరో కేసు నమోదవుతుంది.

తాజాగా మరో పరువుదాడి, హత్యాయత్నం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై గత రాత్రి అమ్మాయి తరపు వాళ్ళు దాడి చేశారు. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారి జీవితం వారు బతుకుతున్నారు.

అయితే ఈ పెళ్లి ఇష్టం లేని పావని కుటుంబ సభ్యులు సాంబశివరావుపై పగ పెంచుకున్నారు. గత రాత్రి సాంబశివరావు, పావని ఓ రెస్టారెంట్ కి వెళ్లడంతో పావని తండ్రి, తమ్ముడు, మరికొంతమంది వాళ్ళని ఫాలో అయి రెస్టారెంట్ లో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సాంబశివరావుని కర్రలతో కొట్టి, చెవి కొరికి దాడి చేశారు. గాయాలతో సాంబశివరావు, పావని కలిసి ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి