iDreamPost

OTT Movie: డైరెక్ట్‌గా OTT లోకి రాబోతున్న యాక్షన్ మూవీ “అసుర గురు”.. ఎక్కడంటే !

  • Published Apr 30, 2024 | 11:51 AMUpdated Apr 30, 2024 | 11:51 AM

ఓటీటీ లోకి వచ్చే ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.. దీనితో ఆయా సినిమాలు ఏ భాషలో వచ్చినా సరే, వాటికి మంచి మార్కులే పడుతున్నాయి. ఈ క్రమంలో మరో కోలీవుడ్ మూవీ తెలుగులో ఓటీటీ లోకి రానుంది.

ఓటీటీ లోకి వచ్చే ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.. దీనితో ఆయా సినిమాలు ఏ భాషలో వచ్చినా సరే, వాటికి మంచి మార్కులే పడుతున్నాయి. ఈ క్రమంలో మరో కోలీవుడ్ మూవీ తెలుగులో ఓటీటీ లోకి రానుంది.

  • Published Apr 30, 2024 | 11:51 AMUpdated Apr 30, 2024 | 11:51 AM
OTT Movie: డైరెక్ట్‌గా OTT లోకి  రాబోతున్న యాక్షన్ మూవీ “అసుర గురు”.. ఎక్కడంటే !

సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీనితో థియేటర్స్ లో సినిమాలు చూసే వారికంటే కూడా.. ఓటీటీ లో సినిమాలు చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో భారీ బడ్జెట్ తో వస్తుంటే మరి కొన్ని సినిమాలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. దీనితో ఓటీటీ లవర్స్ ఖుషి అయిపోతున్నారు. పైగా ఇతర భాషల సినిమాలు.. తెలుగులో వస్తే వాటిని ఇంకాస్త ఎక్కువగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక తమిళ సినిమా ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు.. “అసుర గురు”. విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలలో నటించిన.. తమిళ యాక్షన్ మూవీ.. ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. అసుర గురు పేరుతోనే తెలుగులో కూడా ఈ సినిమా డబ్ అవుతోంది. 2020 లో తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమాకు రాజ్‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. అయితే నాలుగేళ్ల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనితో బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడ్డ ఈ సినిమా ఇన్నేళ్లకు ఇప్పుడు తెలుగులో ఓటీటీ లోకి రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 3 నుంచి ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్ లో ప్లాప్ అయిన ఈ సినిమా.. ఓటీటీ లో ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

ఇక అసుర గురు సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ఓ దొంగ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ఓ దొంగ, పోలీసులకు దొరకకుండా డబ్బును దోచేయాలని చూస్తుంటాడు. దీనితో అతనిని పోలీసులకు పట్టించాలని అనుకుంటూ ఉంటుంది మహిమ.. ఈ క్రమంలో అతను సామాన్యులకు సహాయం చేయడానికి ఈ దొంగతనాలు చేస్తున్నాడనే విషయం తెలుస్తుంది. అయినా కూడా అతనిని పోలీసులకు పట్టించాలని అనుకుంటుందా! వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ! ఈ విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి